NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Avalanche: బద్రీనాథ్ సమీపంలో హిమపాతంలో చిక్కుకున్న 47 మంది కార్మికులు 
    తదుపరి వార్తా కథనం
    Avalanche: బద్రీనాథ్ సమీపంలో హిమపాతంలో చిక్కుకున్న 47 మంది కార్మికులు 
    బద్రీనాథ్ సమీపంలో హిమపాతంలో చిక్కుకున్న 47 మంది కార్మికులు

    Avalanche: బద్రీనాథ్ సమీపంలో హిమపాతంలో చిక్కుకున్న 47 మంది కార్మికులు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 28, 2025
    03:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గత కొన్ని రోజులుగా విస్తారంగా మంచు కురుస్తుండగా, శుక్రవారం ఉదయం అక్కడ మంచు చరియలు విరిగిపడ్డాయి.

    ఈ ఘటనలో పదుల సంఖ్యలో కార్మికులు చిక్కుకుపోయారు. బద్రీనాథ్‌ ధామ్‌కు సంబంధించిన జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

    సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ) సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.

    ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు రహదారి నిర్మాణ పనుల్లో నిమగ్నంగా ఉన్నారని తెలుస్తోంది.

    వివరాలు 

     అప్రమత్తంగా అంబులెన్స్‌లు

    ఈ ఘటన బద్రీనాథ్‌కు సమీపంలోని మనా గ్రామంలో ఉన్న బీఆర్‌ఓ క్యాంప్‌ సమీపంలో జరిగింది.

    మొత్తం 57 మంది కార్మికులు మంచు చరియల కింద చిక్కుకుపోయినట్లు బీఆర్‌ఓ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ సీఆర్‌ మీనా తెలిపారు.

    వీరిలో 10 మందిని రక్షించి క్యాంప్‌కు తరలించారు. మిగతా కార్మికుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

    అధికారులు అంబులెన్స్‌లను అప్రమత్తంగా ఉంచారు. అయితే, దట్టమైన మంచు కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని బీఆర్‌ఓ అధికారులు వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తరాఖండ్

    తాజా

    Rinku Singh: వైభవంగా భారత క్రికెటర్‌ రింకు సింగ్, ఎంపీ ప్రియ సరోజ్ నిశ్చితార్థం రింకూ సింగ్
    Singireddy Narayana Reddy: పాటలలో పరవశించిన కవి.. తెలుగు గేయానికి తాళం చెక్కిన తాత్వికుడు 'సినారే'! టాలీవుడ్
    Kamal Haasan: ఆ విషయంలో తమిళనాడు ఒంటరి కాదు.. ఆంధ్ర, కర్ణాటకకు అండగా ఉంటా : కమల్‌ హాసన్ కమల్ హాసన్
    Covid Cases: దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా.. 65 మంది మృతి! కోవిడ్

    ఉత్తరాఖండ్

    Uttarakhand Tunnel : చిక్కుముడిలో ఉత్తరాఖండ్ సొరంగం.. రెస్క్యూ ఆపరేషన్‌కు అవాంతరం భారతదేశం
    Uttarakhand rescue: 14రోజులుగా సొరంగంలోనే కార్మికులు.. డ్రిల్లింగ్ యంత్రానికి మరోసారి అడ్డంకి  తాజా వార్తలు
    Uttarkashi: డ్రిల్లింగ్ సమయంలో విరిగిన అగర్ మెషిన్.. రెస్క్యూ ఆపరేషన్ మరింత ఆలస్యం తాజా వార్తలు
    Uttarkashi Tunnel Rescue: మాన్యువల్ డ్రిల్లింగ్ కోసం రంగంలోకి భారత సైన్యం  ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025