NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Odisha: ఒడిశా ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. నర్సు తప్పుడు ఇంజెక్షన్‌.. ఐదుగురు రోగులు మృతి
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Odisha: ఒడిశా ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. నర్సు తప్పుడు ఇంజెక్షన్‌.. ఐదుగురు రోగులు మృతి
    ఒడిశా ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. నర్సు తప్పుడు ఇంజెక్షన్‌.. ఐదుగురు రోగులు మృతి

    Odisha: ఒడిశా ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. నర్సు తప్పుడు ఇంజెక్షన్‌.. ఐదుగురు రోగులు మృతి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 04, 2025
    09:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

    సాహిద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రోగులకు నర్సు తప్పుగా ఇచ్చిన ఇంజెక్షన్ల కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

    ఈ విషాదకర సంఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

    వివరాల్లోకి వెళితే.. ఈ ఆసుపత్రిలోని ఐసీయూ, సర్జికల్‌ వార్డుల్లో చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు నిన్న రాత్రి వేళ గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు.

    మృతుల కుటుంబ సభ్యుల ప్రకారం, ఈ ఐదుగురికీ మృత్యువాత పడే కొన్ని నిమిషాల ముందే ఆసుపత్రి సిబ్బంది రెండో రౌండ్ ఇంజెక్షన్లు ఇచ్చినట్టు తెలిపారు.

    వివరాలు 

    పోలీసులకు బాధితులు ఫిర్యాదు

    "అర్ధరాత్రి ఓ నర్సు వచ్చి మా పక్కనే ఉన్న ముగ్గురు రోగులకు ఇంజెక్షన్లు ఇచ్చారు. మా సోదరికి కూడా అదే రకం సూది వేశారు. కొద్ది క్షణాల్లోనే ఆమె తీవ్ర నొప్పితో కేకలు వేస్తూ కుప్పకూలిపోయింది. డాక్టర్‌ వచ్చి పరిశీలించేలోపు ఆమె మృతి చెందింది" అని ఓ మృతురాలి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

    చనిపోయిన వారంతా గతంలో అక్కడే శస్త్రచికిత్స చేయించుకున్నవారే అని, ఆపరేషన్ అనంతరం ఆరోగ్యం మెరుగ్గానే ఉందని అని మృతుల కుటుంబసభ్యులు పేర్కొన్నారు.

    అయితే, ఇంజెక్షన్‌ ఇవ్వగానే వారి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందని తెలిపారు.

    ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించారంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    వివరాలు 

    స్పందించని ఆసుపత్రి యాజమాన్యం

    పోలీసులు ఆసుపత్రికి చేరుకొని అక్కడ భద్రతను పటిష్టంగా ఏర్పాటు చేశారు.

    ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తుగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

    మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మరణానికి గల అసలు కారణాలు స్పష్టమవుతాయని పోలీసులు తెలిపారు.

    అయితే, ఇప్పటి వరకు ఆసుపత్రి యాజమాన్యం దీనిపై ఎటువంటి స్పందన ఇవ్వలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఒడిశా

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    ఒడిశా

    Anubhav Mohanty: ఒడిశా అధికార పార్టీ కి షాక్.. బీజేపీ గూటికి సిట్టింగ్ ఎంపీ భారతదేశం
    Odisha : ఒడిశాలోని జాజ్‌పూర్‌లో ఘోర ప్రమాదం.. ఫ్లై ఓవర్‌పై నుంచి బస్సు పడి 5గురు మృతి, 38 మందికి గాయాలు భారతదేశం
    ITCM: స్వదేశీ సాంకేతికత క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం  టెక్నాలజీ
    Boat sinked in Mahanadi: ఒడిశాలో ఘోర ప్రమాదం..మహానదిలో పడవ మునిగి ఎనిమిదిమంది మృతి.. భువనేశ్వర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025