NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Maha Kumbh Mela: మహా కుంభమేళాలో తప్పిపోయిన 54,000 మంది భక్తులు తిరిగి ఇంటికి చేరిక
    తదుపరి వార్తా కథనం
    Maha Kumbh Mela: మహా కుంభమేళాలో తప్పిపోయిన 54,000 మంది భక్తులు తిరిగి ఇంటికి చేరిక
    మహా కుంభమేళాలో తప్పిపోయిన 54,000 మంది భక్తులు తిరిగి ఇంటికి చేరిక

    Maha Kumbh Mela: మహా కుంభమేళాలో తప్పిపోయిన 54,000 మంది భక్తులు తిరిగి ఇంటికి చేరిక

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 03, 2025
    03:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా 2025 మహాశివరాత్రి పండుగ రోజున చివరి అమృత స్నానంతో ముగియనుంది.

    ఈ 45 రోజుల వేడుకలో 66 కోట్ల మందికిపైగా భక్తులు త్రివేణి సంగమంలో స్నానమాచరించారు.

    45 రోజుల్లో ఇప్పటివరకు 66 కోట్ల 21 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.

    ప్రయాగరాజ్‌లో ఇటీవల తమ కుటుంబ సభ్యుల నుంచి విడిపోయిన 54,000 మంది తిరిగి వారి బంధువులను కలుసుకున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది.

    మహా కుంభమేళా 2025, చరిత్రలో మరొక గొప్ప అధ్యాయంగా నిలిచింది. అశేష భక్తజన సందోహం మధ్య చాలా మంది తమ కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోయిరు.

    Details

    డిజిటల్ 'ఖోయా పాయా కేంద్రం' కీలక భూమిక

    అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమర్థమైన చర్యల కారణంగా 54,357 మంది తిరిగి వారి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు.

    ఈ సందర్భంగా 'డిజిటల్ ఖోయా పాయా కేంద్రం' సేవలు ఎంతో ప్రభావవంతంగా పనిచేశాయి.

    రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాల ద్వారా 35,000 మందికి పైగా భక్తులు తిరిగి తమ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు.

    మొత్తం 10 డిజిటల్ ఖోయా పాయా కేంద్రాలు మహాకుంభమేళా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.

    మకర సంక్రాంతి (జనవరి 13-15) సమయంలో 598 మంది, మౌని అమావాస్య (జనవరి 28-30) రోజుల్లో 8,725 మంది, బసంత్ పంచమి (ఫిబ్రవరి 2-4) సందర్భంగా 864 మంది తమ కుటుంబ సభ్యులను తిరిగి కలుసుకున్నారు.

    Details

     తదుపరి కుంభమేళా ఎక్కడ, ఎప్పుడు? 

    ఈ మహా కుంభమేళాలో ప్రభుత్వంతో పాటు, హేమ్వతి నందన్ బహుగుణ స్మృతి సమితి, భారత్ సేవా కేంద్రం వంటి స్వచ్ఛంద సంస్థలు కూడా తమ సేవలు అందించాయి.

    మహా కుంభమేళా 2025 విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో, తదుపరి కుంభమేళా 2027లో మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో త్ర్యంబకేశ్వర్ వద్ద జరగనుంది.

    ఈ పవిత్ర మహోత్సవం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యోగి ఆదిత్యనాథ్
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Maganti Gopinath : జూబ్లీహిల్స్ గోపినాథ్ కన్నుమూత.. నిర్మాతగా ఆయన తీసిన సినిమాలివే! జూబ్లీహిల్స్
    Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌ విస్తరణ.. ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం తెలంగాణ
    Maganti Gopinath Political Career: మాగంటి గోపినాథ్ రాజకీయ ప్రస్థానం.. మూడు దశాబ్దాల సేవలకు వీడ్కోలు జూబ్లీహిల్స్
    Balakrishna: గాడ్ ఆఫ్ మాస్‌ రీ ఎంట్రీ.. బాలకృష్ణ NBK111 సినిమాకు ముహూర్తం ఫిక్స్! బాలకృష్ణ

    యోగి ఆదిత్యనాథ్

    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఉత్తర్‌ప్రదేశ్
    యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్: యూపీలో శాంతి‌భద్రతలపై అసెంబ్లీలో డైలాగ్ వార్ అఖిలేష్ యాదవ్
    ఉమేష్ పాల్ హత్య: పోలీసుల అదుపులో అతిక్ అహ్మద్ సన్నిహితుడు బల్లి పండిట్ ఉత్తర్‌ప్రదేశ్
    Explainer: యూపీ మొదటి 'గ్యాంగ్‌స్టర్'; 'అతిక్ అహ్మద్' అరెస్టు, మరణం ఎందుకు సంచలనమయ్యాయి?  ఉత్తర్‌ప్రదేశ్

    ఉత్తర్‌ప్రదేశ్

    Maha Kumbh Mela: మహా కుంభమేళా పుణ్యస్నానాలతో రూ.2 లక్షల కోట్ల ఆదాయం ఇండియా
    Supreme Court: కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంపై రేపు సుప్రీం కోర్టులో విచారణ సుప్రీంకోర్టు
    Maha kumbh mela 2025: ప్రయాగ్ రాజ్'లో భారీగా పెరిగిన టెంట్ అద్దె.. ఎంతంటే..?  లైఫ్-స్టైల్
    Maha Kumbh Mela: ప్రయోగ్‌రాజ్ మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన భక్తులు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025