NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి 547 మంది ఎస్‌ఐలు
    తదుపరి వార్తా కథనం
    Telangana: తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి 547 మంది ఎస్‌ఐలు
    తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి 547 మంది ఎస్‌ఐలు

    Telangana: తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి 547 మంది ఎస్‌ఐలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 11, 2024
    03:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడెమీలో సబ్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది.

    ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

    మొత్తం 547 మంది సబ్ ఇన్స్పెక్టర్లు తమ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసి, పరేడ్‌లో పాల్గొన్నారు.

    అధిక సంఖ్యలో మహిళా ఎస్‌ఐలు

    ఈసారి పోలీస్ అకాడమీ నుంచి పాసవుతున్న 547 మంది ఎస్ఐలలో 145 మంది మహిళా సబ్ ఇన్స్పెక్టర్లు కాగా, 402 మంది పురుష సబ్ ఇన్స్పెక్టర్లు.

    వీరిలో 401 మంది సివిల్ సబ్ ఇన్స్పెక్టర్లుగా ఉన్నారు. 71 మంది ఏఆర్ ఎస్ఐలు, 29 మంది టీజీఎస్‌పీ (RSI)లు, 22 మంది ఐటీసీ ఎస్ఐలు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

    విద్యార్హతలు

    ఎస్ఐల విద్యార్హతలు 

    ఈ 547 మంది సబ్ ఇన్స్పెక్టర్లలో అధికంగా గ్రాడ్యుయేట్‌లే ఉన్నారు.మొత్తం 472 మంది గ్రాడ్యుయేట్ విద్యార్హత కలిగి ఉండగా,75 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్‌లు.

    ప్రత్యేకంగా 248 మంది బిటెక్ చదువులు పూర్తి చేసుకున్నారు.221 మంది డిగ్రీ , 26 మంది ఎంటెక్ , 18 మంది ఎంబీఏ చదివారు.

    ఈ పాసింగ్ అవుట్ పరేడ్‌కు మహిళా సబ్ ఇన్స్పెక్టర్ పల్లి భాగ్యశ్రీ పరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు.

    వయస్సు పరంగా 26-30 సంవత్సరాల వయస్సు గల 283 మంది అభ్యర్థులు అత్యధికంగా ఉండగా, 25 సంవత్సరాల లోపు వయసు గల 182 మంది, 31-35 సంవత్సరాల వయసు గల 58 మంది, 36-42 సంవత్సరాల వయసు గల 24 మంది ఉన్నారు.

    విరాళం 

    వరద భాదితులకు తెలంగాణ పోలీసుల విరాళం 

    తెలంగాణలో వరదల వల్ల నష్టాలు ఏర్పడిన నేపథ్యంలో, పోలీస్ విభాగం తరఫున ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 11,06,83,571ల విరాళం అందజేశారు.

    ఎస్ఐ పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి డీజీపీ జితేందర్, శివధర్ రెడ్డి తదితరులు చెక్‌ను అందజేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    తెలంగాణ

    Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ భారీ వర్షాలు
    IMD Warning: ఐఎండీ తీవ్ర హెచ్చరిక.. అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం భారీ వర్షాలు
    Telangana: భారీ వర్షాలు.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం ప్రభుత్వం
    Heavy Rains: తెలంగాణ, ఏపీ మధ్య నిలిచిపోయిన వాహన రాకపోకలు  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025