NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CM Chandrababu: రాజధానిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం.. స్మారక పార్క్ ఏర్పాటు 
    తదుపరి వార్తా కథనం
    CM Chandrababu: రాజధానిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం.. స్మారక పార్క్ ఏర్పాటు 
    రాజధానిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం.. స్మారక పార్క్ ఏర్పాటు

    CM Chandrababu: రాజధానిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం.. స్మారక పార్క్ ఏర్పాటు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 16, 2025
    01:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.

    ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నారాయణ, డూండీ రాకేశ్‌ సహా పలువురు పాల్గొన్నారు.

    చంద్రబాబు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు 58 రోజుల దీక్షకు గుర్తుగా రాజధానిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.

    ఆయనకు గౌరవసూచకంగా స్మారక పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. నెల్లూరులోని ఆయన స్వగ్రామ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.

    అక్కడ మ్యూజియం ఏర్పాటు చేయడంతో పాటు, ఆధునిక ఉన్నత పాఠశాల నిర్మించనున్నామని తెలిపారు.

    Details

    మార్చి 16 నుంచి జయంతి ఉత్సవాలు 

    ఇక రాష్ట్ర అభివృద్ధి దిశగా తీసుకుంటున్న నిర్ణయాలను వివరించిన చంద్రబాబు, ఈ ఉగాది నుంచి పీ-4 విధానాన్ని అమలు చేస్తామన్నారు.

    రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొలగించేందుకు ఇది ఉపకరిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ముందుకెళ్లాలన్నారు.

    మనలో ప్రతి ఒక్కరూ కనీసం 10 మంది తెలుగువారిని ఎదగడానికి సహాయం చేయాలని పిలుపునిచ్చారు. అంతేగాక పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

    వచ్చే ఏడాది మార్చి 16 వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    అమరావతి

    తాజా

    Operation Sindoor: పాకిస్థాన్ డ్రోన్లు కూల్చేశాం: భారత ఆర్మీ పోస్టు ఆపరేషన్‌ సిందూర్‌
    IPL 2025: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. ఐపీఎల్ 2025 నిలిపివేత దిశగా బీసీసీఐ? బీసీసీఐ
    MISS WORLD: భారత్,పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు.. మిస్ వరల్డ్ పోటీలపై ప్రభావం తెలంగాణ
    Operation Sindoor: భారత్‌-పాక్‌ మధ్య యుద్ధంలో జోక్యం చేసుకోబొం: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ అమెరికా

    చంద్రబాబు నాయుడు

    Andhrapradesh: అమరావతి రైతులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త భారతదేశం
    CM Chandrababu: తెలుగు ప్రజలందరికి కనుమ పండగ శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం చంద్రబాబు కనుమ
    Andhrapradesh: ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్నవారికే  స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఛాన్స్‌..! భారతదేశం
    CM Chandrababu: 'బ్రాండ్ ఏపీ' పేరుతో దావోస్‌కు సీఎం చంద్రబాబు అమరావతి

    అమరావతి

    Amaravati: అమరావతిలో తుది దశకు చేరిన జంగిల్ క్లియరెన్స్ పనులు ఆంధ్రప్రదేశ్
    Chandra babu: అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించిన చంద్రబాబు  చంద్రబాబు నాయుడు
    Narayana: ఏపీ రాజధాని అమరావతికి మరో శుభవార్త.. రూ.11వేల కోట్ల రుణానికి హడ్కో గ్రీన్ సిగ్నల్ భారతదేశం
    Amaravati: అమరావతి కొత్త రైల్వే లైన్.. కీలక నగరాలతో అనుసంధానం రైల్వే శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025