Page Loader
Karnataka: కర్ణాటకలో 6 లక్షల ట్రక్కర్లు సమ్మెలోకి.. నిత్యావసరాల సరఫరాకు బ్రేక్!
కర్ణాటకలో 6 లక్షల ట్రక్కర్లు సమ్మెలోకి.. నిత్యావసరాల సరఫరాకు బ్రేక్!

Karnataka: కర్ణాటకలో 6 లక్షల ట్రక్కర్లు సమ్మెలోకి.. నిత్యావసరాల సరఫరాకు బ్రేక్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 15, 2025
12:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలో ట్రక్కుల సమ్మె కారణంగా జనజీవనం తీవ్రంగా ప్రభావితమవుతోంది. దాదాపు ఆరు లక్షల ట్రక్కులు సమ్మెలో పాల్గొనడంతో నిత్యావసర సరఫరాలో అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలో పాలు తరలించే ట్రక్కులు తప్ప మిగిలిన అన్ని వాహనాలు రోడ్లపైకి రాలేదని రవాణా సంఘాలు వెల్లడించాయి. ఇక 24 రాష్ట్రాల నుండి 60కి పైగా రవాణా సంఘాలు ఈ సమ్మెకు మద్దతు ప్రకటించాయి. ఏప్రిల్ 14 అర్ధరాత్రి నుంచి ఈ నిరవధిక సమ్మె ప్రారంభమైంది. దీని వెనుక ప్రధాన కారణాలు డీజిల్ ధరల పెరుగుదల, టోల్ గేట్‌ల వద్ద వేధింపులు, ఇతర శుల్కాల భారం. కర్ణాటక రాష్ట్ర లారీ యజమానులు, ఏజెంట్ల సంఘం ఆధ్వర్యంలో ఈ సమ్మె కొనసాగుతోంది.

Details

ధరలు పెరిగే అవకాశం

ఇది ట్రక్కర్లపై భారం కలుగుతోందని, ఇది రాష్ట్రంలోని ప్రతి పౌరుడిని ప్రభావితం చేస్తోందని అసోసియేషన్ అధ్యక్షుడు జి.ఆర్. షణ్ముగప్ప తెలిపారు. ఈ సమ్మె వల్ల తమిళనాడుకు రోజుకు సరఫరా అయ్యే 4,000 లోడ్ల బియ్యం, కూరగాయలు, మందులు నిలిచిపోయాయి. ముఖ్యంగా చెన్నై నగరానికి కోలార్‌, కర్ణాటక ప్రాంతాల నుండి వచ్చే టమోటా ట్రక్కులు నిలిచిపోవడం వల్ల రేట్లు పెరిగే అవకాశముంది. ప్రస్తుతం టమోటాల ధర రూ. 25 ఉండగా, ఇది మరింత పెరగవచ్చని షణ్ముగప్ప హెచ్చరించారు. అలాగే నాసిక్‌ నుండి ఉల్లిపాయల సరఫరా ఆలస్యం కావడంతో వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. రోజూ 15,000 ట్రక్కులు మహారాష్ట్ర, గుజరాత్‌ నుంచి కర్ణాటక గుండా ప్రయాణిస్తుంటాయి. ఇప్పుడు వీటి రాకపోకలు కూడా అంతరాయం కలిగించేలా ఉన్నాయి.

Details

ట్రక్కర్ల ప్రధాన డిమాండ్లు

టోల్ వసూలును పూర్తిగా రద్దు చేయాలి. ఆర్టీవో చెక్‌పోస్టులను రాష్ట్ర సరిహద్దుల్లో నుంచి తొలగించాలి. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పునరుద్ధరణకు కేంద్రం విధించిన రూ. 15,000 ఛార్జ్‌ను ఉపసంహరించాలి. బెంగళూరులో ట్రక్కులకు ఉన్న ''నో ఎంట్రీ'' పరిమితిని సడలించాలి. ఈ సమ్మెను త్వరగా పరిష్కరించకపోతే, నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.