NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Guillain-Barre syndrome: మహారాష్ట్రను వణికిస్తున్న జీబీఎస్.. కేసులు ఎన్నంటే?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Guillain-Barre syndrome: మహారాష్ట్రను వణికిస్తున్న జీబీఎస్.. కేసులు ఎన్నంటే?
    మహారాష్ట్రను వణికిస్తున్న జీబీఎస్.. కేసులు ఎన్నంటే?

    Guillain-Barre syndrome: మహారాష్ట్రను వణికిస్తున్న జీబీఎస్.. కేసులు ఎన్నంటే?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 12, 2025
    05:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలో గులియన్ బారే సిండ్రోమ్ (GBS) వ్యాప్తి ప్రజలను తీవ్రంగా కలవరపెడుతోంది.

    మృతుల సంఖ్య పెరుగుతున్నట్లుగా, కేసుల సంఖ్య కూడా అధికమవుతుండటంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.

    ప్రభుత్వ ఆరోగ్య శాఖ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, కొత్త కేసుల నమోదు పెరుగుతూనే ఉంది.

    ఈ అరుదైన న్యూరోలాజికల్ వ్యాధి ఇప్పటివరకు పుణేలో అధికంగా కనిపించినప్పటికీ, ఇప్పుడు ముంబయిలోనూ మొదటి మరణం నమోదైంది.

    53 ఏళ్ల వ్యక్తి మూడు వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

    వివరాలు 

    కేసుల పెరుగుదల, తొలి ముంబయి మరణం 

    ప్రారంభంలో గులియన్ బారే సిండ్రోమ్ కేసులు ఎక్కువగా పుణేలో నమోదయ్యాయి.

    అయితే, ఇటీవలి కాలంలో ముంబయిలో కూడా ఈ వ్యాధి ప్రబలుతోంది.

    తాజాగా మరో ఐదు కేసులు గుర్తించడంతో, మొత్తం కేసుల సంఖ్య 167 నుంచి 172కు పెరిగింది.

    ఇప్పటివరకు ఈ వ్యాధితో ఏడుగురు మరణించగా, ముంబయిలో నమోదైన తొలి మరణంతో ఆ సంఖ్య ఎనిమిదికి చేరింది.

    వివరాలు 

    ఆసుపత్రిలో చికిత్స పొందిన వ్యక్తి మరణం 

    ముంబయిలోని వాడాలా ప్రాంతానికి చెందిన 53 ఏళ్ల వ్యక్తి జనవరి 22న అస్వస్థతతో ఆసుపత్రికి వెళ్లారు.

    వైద్య పరీక్షల అనంతరం జనవరి 23న అతనికి GBS ఉందని నిర్ధారణ అయ్యింది.

    ఆసుపత్రిలో వార్డు బాయ్‌గా పనిచేస్తున్న ఆయనను అక్కడే ఉంచి చికిత్స అందించారు.

    అయితే, శ్వాస సమస్యలు తీవ్రమవడంతో వెంటిలేటర్‌పై ఉంచాల్సి వచ్చింది.

    మూడు వారాలుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం మరింత విషమించి, ఫిబ్రవరి 12న ప్రాణాలు కోల్పోయారు.

    వివరాలు 

    ఆరోగ్య శాఖ నివేదిక 

    మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అందించిన నివేదిక ప్రకారం, ఇప్పటివరకు 172 గులియన్ బారే సిండ్రోమ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో:

    పుణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 40 కేసులు

    పుణే రూరల్ ఏరియాలో 28 కేసులు

    పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 29 కేసులు

    ఇతర గ్రామాల నుంచి 92 కేసులు

    మిగతా జిల్లాల నుంచి 8 కేసులు

    ఇప్పటి వరకు ఈ వ్యాధి సోకి ఆసుపత్రిలో చికిత్స పొందిన 104 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర

    తాజా

    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,700 స్టాక్ మార్కెట్
    Vijayawada: రూ.850 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్‌‌కు మహర్దశ.. ఆధునికీకరించేందుకు నీతి ఆయోగ్‌ ఆమోదం విజయవాడ సెంట్రల్
    Kuppam: కుప్పంలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులపైకి కారు.. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన గ్రామీణ సీఐ కుప్పం
    Kuldeep Yadav: చిన్న నాటి స్నేహితురాలు వంశికతో కుల్‌దీప్ యాదవ్ నిశ్చితార్థ వేడుక కుల్దీప్ యాదవ్

    మహారాష్ట్ర

    Devendra Fadnavis: మహారాష్ట్ర తదుపరి సీఎంగా దేవేంద్ర ఫడణవీస్‌.. శిందే వర్గం నేత కీలక వ్యాఖ్యలు  భారతదేశం
    Maharastra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై నేడు నిర్ణయం, మహాయుతి నేతలతో అమిత్ షా సమావేశం భారతదేశం
    Maharastra: మహారాష్ట్ర క్యాబినెట్‌లో సగం బెర్త్‌లు బీజీపీ తీసుకునే అవకాశం.. షిండే వర్గానికి మూడు కీలక మంత్రి పదవులు  భారతదేశం
    Maharashtra: అమిత్ షాతో మహాయుతి నేతలు భేటీ; త్వరలో సీఎం ప్రకటన భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025