Guillain-Barre syndrome: మహారాష్ట్రను వణికిస్తున్న జీబీఎస్.. కేసులు ఎన్నంటే?
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలో గులియన్ బారే సిండ్రోమ్ (GBS) వ్యాప్తి ప్రజలను తీవ్రంగా కలవరపెడుతోంది.
మృతుల సంఖ్య పెరుగుతున్నట్లుగా, కేసుల సంఖ్య కూడా అధికమవుతుండటంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.
ప్రభుత్వ ఆరోగ్య శాఖ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, కొత్త కేసుల నమోదు పెరుగుతూనే ఉంది.
ఈ అరుదైన న్యూరోలాజికల్ వ్యాధి ఇప్పటివరకు పుణేలో అధికంగా కనిపించినప్పటికీ, ఇప్పుడు ముంబయిలోనూ మొదటి మరణం నమోదైంది.
53 ఏళ్ల వ్యక్తి మూడు వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
వివరాలు
కేసుల పెరుగుదల, తొలి ముంబయి మరణం
ప్రారంభంలో గులియన్ బారే సిండ్రోమ్ కేసులు ఎక్కువగా పుణేలో నమోదయ్యాయి.
అయితే, ఇటీవలి కాలంలో ముంబయిలో కూడా ఈ వ్యాధి ప్రబలుతోంది.
తాజాగా మరో ఐదు కేసులు గుర్తించడంతో, మొత్తం కేసుల సంఖ్య 167 నుంచి 172కు పెరిగింది.
ఇప్పటివరకు ఈ వ్యాధితో ఏడుగురు మరణించగా, ముంబయిలో నమోదైన తొలి మరణంతో ఆ సంఖ్య ఎనిమిదికి చేరింది.
వివరాలు
ఆసుపత్రిలో చికిత్స పొందిన వ్యక్తి మరణం
ముంబయిలోని వాడాలా ప్రాంతానికి చెందిన 53 ఏళ్ల వ్యక్తి జనవరి 22న అస్వస్థతతో ఆసుపత్రికి వెళ్లారు.
వైద్య పరీక్షల అనంతరం జనవరి 23న అతనికి GBS ఉందని నిర్ధారణ అయ్యింది.
ఆసుపత్రిలో వార్డు బాయ్గా పనిచేస్తున్న ఆయనను అక్కడే ఉంచి చికిత్స అందించారు.
అయితే, శ్వాస సమస్యలు తీవ్రమవడంతో వెంటిలేటర్పై ఉంచాల్సి వచ్చింది.
మూడు వారాలుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం మరింత విషమించి, ఫిబ్రవరి 12న ప్రాణాలు కోల్పోయారు.
వివరాలు
ఆరోగ్య శాఖ నివేదిక
మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అందించిన నివేదిక ప్రకారం, ఇప్పటివరకు 172 గులియన్ బారే సిండ్రోమ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో:
పుణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 40 కేసులు
పుణే రూరల్ ఏరియాలో 28 కేసులు
పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 29 కేసులు
ఇతర గ్రామాల నుంచి 92 కేసులు
మిగతా జిల్లాల నుంచి 8 కేసులు
ఇప్పటి వరకు ఈ వ్యాధి సోకి ఆసుపత్రిలో చికిత్స పొందిన 104 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.