NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / SLBC tunnel Collapse : SLBC టన్నెల్‌ సహాయక చర్యల్లో పురోగతి
    తదుపరి వార్తా కథనం
    SLBC tunnel Collapse : SLBC టన్నెల్‌ సహాయక చర్యల్లో పురోగతి
    SLBC టన్నెల్‌ సహాయక చర్యల్లో పురోగతి

    SLBC tunnel Collapse : SLBC టన్నెల్‌ సహాయక చర్యల్లో పురోగతి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 28, 2025
    06:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.

    ఈరోజు (శుక్రవారం) టన్నెల్‌లో గల్లంతైన 8 మంది కార్మికుల ఆచూకీ కోసం ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టారు.

    రెస్క్యూ ఆపరేషన్ ఏడో రోజుకు చేరగా, శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో కార్మికుల జాడ తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా స్కానింగ్ నిర్వహించగా, కొన్ని మీటర్ల లోతులో శకలాలు ఉన్నట్లు గుర్తించారు.

    టీబీఎం మిషన్ కట్టింగ్, శిథిలాల తొలగింపు

    దక్షిణ మధ్య రైల్వే నిపుణులు టీబీఎం మిషన్‌ను ప్లాస్మా గ్యాస్ కట్టర్స్ సాయంతో కట్ చేశారు.

    బురద, శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టి, జీపీఆర్ టెక్నాలజీ ద్వారా కొన్ని శకలాలను గుర్తించారు. వీటిని మృతదేహాలుగా భావిస్తూ పరిశీలన చేస్తున్నారు.

    వివరాలు 

    గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) పరీక్షలు 

    ఈ రోజు కార్మికుల ఆచూకీ కోసం ప్రభుత్వం అత్యాధునిక 'గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్' (జీపీఆర్) పరీక్షలు నిర్వహించింది.

    గురువారం, జీపీఆర్ పరికరాన్ని సొరంగం లోపలికి పంపించి, పైకప్పు కూలిన ప్రాంతంలో మట్టి, శిథిలాల కింద ఏమైనా ఉందా అనేది పరిశీలించారు.

    ఈ ప్రక్రియలో కొన్ని శకలాలను గుర్తించి, దాదాపు మూడు మీటర్ల లోతులో మెత్తని భాగాలు ఉన్నట్లు తేలింది.

    జీపీఆర్ టెక్నాలజీ ద్వారా సహాయక చర్యలు

    టన్నెల్ ప్రమాద స్థలంలో సహాయక చర్యలను వేగవంతం చేయడానికి నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌జీఆర్ఐ) ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది.

    భూమిలో కూరుకుపోయిన వారి స్థితిని గుర్తించేందుకు ఆధునాతన 'జీరో గ్రావిటీ పెనెట్రేటింగ్ రాడార్' (జీపీఆర్) టెక్నాలజీని ఉపయోగించి టన్నెల్‌ను పూర్తిగా స్కాన్ చేసింది.

    వివరాలు 

    రెండు రోజుల్లో మరింత సమాచారం 

    ఈ టన్నెల్‌లో చిక్కుకున్న వారి ఖచ్చితమైన సమాచారం రావడానికి మరో రెండు రోజులు పట్టవచ్చని సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు.

    ఎన్జీఆర్ఐ ద్వారా తీసిన స్కాన్ పిక్చర్స్ ద్వారా కొన్ని ప్రాంతాలను గుర్తించినప్పటికీ, పూర్తిగా ఖచ్చితమైన సమాచారం అందుకోవడానికి మరిన్ని రాడార్ పిక్చర్స్ అవసరమని అన్నారు.

    అంతవరకు సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    తెలంగాణ

    Telangana: నకిలీ క్లినిక్‌లపై కఠిన చర్యలు.. పట్టుబడితే రూ.5లక్షలు ఫైన్! హైదరాబాద్
    Krishna Board: శ్రీశైలం, సాగర్‌లో ఉన్న నీరు పూర్తిగా మాదే.. తెలంగాణ శ్రీశైలం
    Telangana: రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం.. తెలంగాణలో గరిష్ఠ స్థాయికి! విద్యుత్
    Uttam Kumar Reddy: జగన్‌తో స్నేహం కొనసాగిస్తూ తెలంగాణకు అన్యాయం: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025