Delhi: దిల్లీలో దట్టమైన పొగమంచు..134 విమానాలు, 22 రైళ్లపై ఎఫెక్ట్, సున్నాకి దగ్గరగా దృశ్యమానత
దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో గురువారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు 134 విమానాలు ఆలస్యమయ్యాయి. దృశ్యమానత దాదాపు సున్నాకి పడిపోయింది. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయం దాదాపు 134 విమానాలు(దేశీయ,అంతర్జాతీయ)రాకపోకలపై తీవ్రమైన ప్రభావం పడింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ FIDS (ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే సిస్టమ్) డేటాను ఉటంకిస్తూ ANI నివేదించింది. అదే సమయంలో దేశ రాజధానిలో పొగమంచు,తక్కువ దృశ్యమానత కారణంగా ఢిల్లీ వచ్చే 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సియస్కు పడిపోవడంతో దేశ రాజధానిలో చలిగాలుల పరిస్థితులు కొనసాగుతున్నాయి.
నిరాశ్రయులైన ప్రజలను నైట్ షెల్టర్లకు తరలింపు
ఉదయం 5.30 గంటల వరకు, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో అలాగే హర్యానా, చండీగఢ్,ఢిల్లీ, నైరుతి రాజస్థాన్,ఉత్తర మధ్యప్రదేశ్లోని వివిక్త పాకెట్లలో చాలా దట్టమైన పొగమంచు (0-25 మీటర్లు) గమనించబడింది. ఢిల్లీలోని సఫ్దర్జంగ్లో 50మీ, పాలెంలో 25మీ విజిబిలిటీ నమోదైంది. ఇదిలా ఉండగా, నగరంలో చలిగాలుల తాకిడి మరోసారి నిరాశ్రయులైన ప్రజలను నైట్ షెల్టర్లకు తరలించారు. దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు తగ్గడంతో ప్రజలు నైట్ షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఢిల్లీ-ఎన్సిఆర్లలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఉత్తర భారతదేశం మొత్తం చలిగాలులను ఎదుర్కొంటోంది. గురువారం,శుక్రవారం రాత్రి ,తెల్లవారుజామున ఢిల్లీలో దట్టమైన పొగమంచు కప్పబడి ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
చలిగాలుల కారణంగా పాఠశాలల సమయాలలో మార్పు
దేశ రాజధానికి పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గురు, శుక్రవారాల్లో వివిధ నగరాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఘజియాబాద్లో 1 నుంచి 8వ తరగతి వరకు అన్ని పాఠశాలల సమయాన్ని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మార్చినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా మేజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, అలీఘర్లో, అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ పరిధిలోని పాఠశాలలతో సహా 1 నుండి 12వ తరగతి వరకు అన్ని బోర్డుల క్రింద ఉన్న పాఠశాలలు గురువారం,శుక్రవారం మూసేస్తారు.
15 రోజుల పాటు శీతాకాల సెలవులు
అదే విధంగా, మథురలో, తరగతుల సమయాన్ని ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మార్చారు. 1 నుంచి 8వ తరగతి వరకు జలాన్లోని పాఠశాలలను డిసెంబర్ 31 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా, ఉత్తర భారతదేశంలో చలిగాలులు విజృంభిస్తున్నందున, రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 31, 2023 నుండి జనవరి 14, 2024 వరకు 15 రోజుల పాటు శీతాకాల సెలవులను ప్రకటించింది.