NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hyderabad: హైదరాబాద్ వాసులకు బకాయిలు చెల్లించేందుకు సువర్ణావకాశం 
    తదుపరి వార్తా కథనం
    Hyderabad: హైదరాబాద్ వాసులకు బకాయిలు చెల్లించేందుకు సువర్ణావకాశం 
    హైదరాబాద్ వాసులకు బకాయిలు చెల్లించేందుకు సువర్ణావకాశం

    Hyderabad: హైదరాబాద్ వాసులకు బకాయిలు చెల్లించేందుకు సువర్ణావకాశం 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 06, 2024
    04:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్ నగరవాసులకు ఓ సువర్ణావకాశం లభించింది.

    దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నీటి బిల్లుల బకాయిలు తేల్చుకునేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ వాటర్ బోర్డు మరోసారి ఓటీఎస్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

    దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 01 నుంచి 31 వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ పథకంలో భాగంగా, వినియోగదారులు బకాయిలను చెల్లిస్తే వడ్డీ, ఫైన్లు మాఫీ కానున్నాయి.

    అధికారికంగా వెచ్చించిన నిబంధనల ప్రకారం బకాయిలు పూర్తిగా చెల్లించిన వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

    Details

    నియమాలు ఇవే

    ఈ పథకం కేవలం అక్టోబర్ 31 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది.

    యాక్టివ్ కనెక్షన్ ఉన్న వినియోగదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

    - గతంలో ఓటీఎస్ పథకాన్ని ఉపయోగించని వారు బకాయిలను ఒకేసారి చెల్లిస్తే, అన్ని వడ్డీలు, ఆలస్య రుసుములు పూర్తిగా మాఫీ అవుతాయి.

    - గతంలో ఓటీఎస్ ఉపయోగించిన వారు 50% వరకు వడ్డీ మాఫీ పొందగలరు.

    - పథకం కింద ప్రయోజనం పొందాలనుకునే వినియోగదారులు భవిష్యత్తులో 24 నెలల పాటు క్రమంగా బిల్లులు చెల్లిస్తామని ఆఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది.

    Details

     వడ్డీ మాఫీ విధానం 

    మేనేజర్ స్థాయిలో ఉన్న అధికారులకు రూ. 2,000 వరకు వడ్డీ మాఫీ చేస్తారు.

    డిప్యూటీ జనరల్ మేనేజర్ రూ. 2,001 నుంచి రూ. 10,000 వరకు వడ్డీ మాఫీ చేయవచ్చు.

    - జనరల్ మేనేజర్ స్థాయిలో రూ. 10,001 నుంచి లక్ష రూపాయల వరకు వడ్డీ మాఫీ సాధ్యమవుతుంది.

    - చీఫ్ జనరల్ మేనేజర్ రూ. 1,00,001 పైగా వడ్డీ మాఫీ చేసే అధికారాన్ని కలిగి ఉంటారు.

    వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    వ్యాపారం

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    హైదరాబాద్

    Telangana: ధూల్​పేటలో జోరుగా వినాయక విగ్రహాల విక్రయాలు.. థీమ్​ విగ్రహాలు కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి  భారతదేశం
    Hydra: హైడ్రా మరింత బలోపేతం.. మూడు జోన్లుగా విభజన ఇండియా
    CV Anand: హైద‌రాబాద్ సీపీగా మళ్లీ సీవీ ఆనంద్ నియామకం  తెలంగాణ
    Murali Mohan: టీడీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్.. మురళీ మోహన్ సంస్థకు హైడ్రా నోటీసులు ఇండియా

    వ్యాపారం

    పన్నును ఆలస్యంగా దాఖలు చేస్తే నేరమే.. సీబీడీటీ ఛైర్మన్ పన్ను
    Intel Lays OFF: 18వేల మంది ఉద్యోగులపై వేటు వేసిన ఇంటెల్ అమెరికా
    Zomato: మళ్లీ పెరిగిన జొమాటో ఆదాయం.. ఈసారి రూ.253 కోట్లు జొమాటో
    Apple: విక్రయాల వృద్ధిలో 'ఆపిల్' సంచలన రికార్డు.  ఆపిల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025