Page Loader
ఒడిశా: బార్‌గఢ్‌లో మరో రైలు ప్రమాదం 

ఒడిశా: బార్‌గఢ్‌లో మరో రైలు ప్రమాదం 

వ్రాసిన వారు Stalin
Jun 05, 2023
12:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒడిశాలోని డుంగురి నుంచి బార్‌గఢ్‌కు వెళ్తున్న మరో గూడ్స్ రైలు సోమవారం మెంధపలి సమీపంలో పట్టాలు తప్పింది. బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయిన మూడు రోజుల తర్వాత ఈ ఘటన జరగడం గమనార్హం. గూడ్స్ రైలు డుంగూరి నుంచి బార్‌గఢ్‌కు సున్నపురాయితో వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. అయితే ఈ ప్రమాదం జరిగిన రైలు భారతీయ రైల్వే వ్యవస్థతో అనుసంధానించబడలేదు. ఈ గూడ్స్ రైలు డుంగ్రి సున్నపురాయిని ఓ ప్రైవేటు సిమెంట్ ప్లాంట్‌కు చేరవేస్తుంది. ఈ విషయంలో రైల్వే పాత్ర ఏమీ లేదని ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటనలో తెలిపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గూడ్స్ రైలు పట్టాలు తప్పిన దృశ్యాలు