Page Loader
Leopard Attack : తొమ్మిదేళ్ల బాలికను చంపేసిన చిరుతపులి
తొమ్మిదేళ్ల బాలికను చంపేసిన చిరుతపులి

Leopard Attack : తొమ్మిదేళ్ల బాలికను చంపేసిన చిరుతపులి

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 19, 2023
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లో చిరుతపులి (Leopard) దాడిలో తొమ్మిదేళ్ల బాలిక మృతి చెందిన ఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. నెహ్‌తౌర్ ప్రాంతంలోని బధిలావా గ్రామంలో నైనా అనే బాలికపై చిరుతపులి దాడి చేసి చంపేసింది. పొలంలో పనిచేస్తున్న తన తండ్రిని కలవడానికి వెళ్తున్న బాలికపై వెనుక నుంచి వచ్చి చిరుతపులి దాడి చేయడంతో ఈ ఘటన చోటు చేసుకుందని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్(డీఎఫ్ఓ) అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున శబ్దాలు చేయడంలో చిరుతపులి సమీపంలోని అడవిలోకి పారిపోయిందని చెప్పారు.

Details

భయాందోళనలో గ్రామస్థులు

చిరుతపులి దాడిలో తీవ్రంగా గాయపడిన బాలికను ధాంపూర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇక చిరుతపులిని బంధించేందుకు ఆపరేషన్ ప్రారంభించినట్లు డీఎఫ్ఓ తెలిపారు. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే చిరుతపులిని బంధించాలని కోరారు. బాలిక తండ్రి మహేంద్ర జార్ఖండ్‌కు చెందినవాడు. అతను బధియోవాలాలోని చెరకు పొలంలో కూలీగా పనిచేస్తున్నాడు.