Page Loader
కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు
కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు

కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు

వ్రాసిన వారు Stalin
May 25, 2023
01:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించేలా లోక్‌సభ సెక్రటేరియట్‌, కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో గురువారం పిల్ దాఖలైంది. మే 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు పేర్కొంటూ కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, జేడీ(యూ)తో సహా 20 ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా సంయుక్త ప్రకటన విడుదల చేసిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రపతిని ఆవిర్భావ వేడుకల్లో చేర్చకపోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని సుప్రీంకోర్టు న్యాయవాది సీఆర్ జయ సుకిన్ తన దాఖలు చేసిన పిటషన్‌లో పేర్కొన్నారు.

కాంగ్రెస్

రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం సరికాదు: పిటిషనర్

పార్లమెంట్ భారతదేశ అత్యున్నత శాసనమండలని తన పిటిషన్‌లో జయ సుకిన్ వివరించారు. లోక్‌సభ లేదా రాజ్యసభలో ఏ సభనైనా పిలిపించే అధికారం రాష్ట్రపతికి ఉందని కూడా చెప్పారు. పార్లమెంట్ లేదా లోక్‌సభను రద్దు చేసే అధికారం కూడా రాష్ట్రపతికి ఉందని స్పష్టం చేశారు. ఇంతటి కీలకమైన రాష్ట్రపతిని పార్లమెంట్ ప్రారంభోత్సవానికి కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించలేదని, ఇది సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆహ్వానం మేరకు మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.