Justin Trudeau:విమానంలో సాంకేతిక లోపం.. 48గంటల ఆలస్యం తర్వాత కెనడాకు ట్రూడో
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన విమానంలో సాంకేతిక లోపం కారణంగా 48 గంటల పాటు చిక్కుకుపోయిన తరువాత భారత దేశాన్ని విడిచి కెనడాకు బయల్దేరారు. ట్రూడో,అతని ప్రతినిధి బృందం సెప్టెంబర్ 8న G20 సమ్మిట్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చారు. వారు రెండు రోజుల తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లవలసి ఉంది. కానీ వారి ఎయిర్బస్ లో తీవ్రమైన సాంకేతిక లోపం కారణంగా ట్రూడో బసను పొడిగించాల్సి వచ్చింది. కెనడా ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ప్రెస్ సెక్రటరీ మొహమ్మద్ హుస్సేన్, సాంకేతిక సమస్య పరిష్కరించబడిందని, విమానం ఎగరడానికి అనుమతి వచ్చిందని పేర్కొన్నారు. ట్రూడోను చూసేందుకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. G20 సమ్మిట్కు హాజరైనందుకు ధన్యవాదాలు తెలిపారు.