NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఎల్బీ నగర్ కాంగ్రెస్‌ టికెట్ మధు యాష్కీకి ఇవ్వొందంటూ వెలిసిన పోస్టర్లు 
    తదుపరి వార్తా కథనం
    ఎల్బీ నగర్ కాంగ్రెస్‌ టికెట్ మధు యాష్కీకి ఇవ్వొందంటూ వెలిసిన పోస్టర్లు 
    ఎల్బీ నగర్ కాంగ్రెస్‌ టికెట్ మధు యాష్కీకి ఇవ్వొందంటూ వెలిసిన పోస్టర్లు

    ఎల్బీ నగర్ కాంగ్రెస్‌ టికెట్ మధు యాష్కీకి ఇవ్వొందంటూ వెలిసిన పోస్టర్లు 

    వ్రాసిన వారు Stalin
    Sep 04, 2023
    06:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో పోస్టర్ల వార్ నడుస్తోంది.

    ఎల్బీనగర్ కాంగ్రెస్ టికెట్‌ను మధు యాష్కికి ఇవ్వొద్దంటూ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ గోడలపై సోమవారం పోస్టర్లు వెలిశాయి.

    ఎల్బీ నగర్‌ కాంగ్రెస్ టికెట్ కోసం మధు‌యాష్కి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

    ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చే 'పారాచూట్' నేతలకు టికెట్ ఇవ్వొద్దని ఆ పోస్టర్ల‌లో రాసి ఉంది.

    కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మధు యాష్కీ గౌడ్‌ చిత్రాన్ని ప్రత్యేకంగా ఆ పోస్టర్లలో ముద్రించారు.

    'సేవ్‌ ఎల్‌బీ నగర్‌ కాంగ్రెస్‌, దయచేసి పారాచూట్‌లకు టికెట్ లేదు అని చెప్పండి. మధు యాష్కీ నిజామాబాద్‌కు తిరిగి వెళ్లాలి' అని ఆ పోస్టర్లలో రాసి ఉంది.

    పోస్టర్

    పోస్టర్ల వెనుక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హస్తం: మధు యాష్కీ గౌడ్‌ 

    తనకు వ్యతిరేకంగా అంటించిన పోస్టర్లపై మధు యాష్కీ గౌడ్‌ స్పందించారు. ఈ పోస్టర్ల వెనుక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హస్తం ఉందని మధుయాష్కీ గౌడ్ చెప్పారు.

    ఒడిపోతాననే భయంతోనే సుధీర్ రెడ్డి తనపై ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఎల్‌బీ నగర్ కాంగ్రెస్ టికెట్ ఆశించిన మిత్రులను కాపాడుకునే బాధ్యత తనదేనన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు తాను పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

    ఎల్‌బీ నగర్‌ కాంగ్రెస్ టికెట్‌ను సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సోదరుడు రాంరెడ్డి, మరో నేత జక్కిడి ప్రభాకర్‌రెడ్డి ఆశిస్తున్నారు.

    ఇప్పుడు ఈ రేసులోకి మధు యాష్కీ రావడంతో ఇక్కడ టికెట్ కోసం ముక్కోణపు పోటీ కనిపిస్తోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    గాంధీ భవన్ గోడలపై వెలసిన పోస్టర్లు

    “Save LB Nagar Congress”, “Go back to Nizambad” read posters put up against Madhu Yashki urging not to give ticket to “Parachutes” pic.twitter.com/1G4mSi78wS

    — Naveena (@TheNaveena) September 4, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎల్బీనగర్
    కాంగ్రెస్
    తాజా వార్తలు

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    ఎల్బీనగర్

    ఎల్బీనగర్ ఆర్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్; ఇక సిగ్నల్ ఫ్రీ జంక్షన్ తెలంగాణ

    కాంగ్రెస్

    INDIA: మోదీ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానానికి రెడీ అవుతున్న ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు
    No confidence motion: లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్, బీఆర్ఎస్  ప్రతిపక్షాలు
    లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఆమోదం లోక్‌సభ
    కాంగ్రెస్ చీకటి పనులు 'రెడ్ డైరీ' రికార్డు అయ్యాయి: ప్రధాని మోదీ రాజస్థాన్

    తాజా వార్తలు

    తెలంగాణ: పారా మెడికల్‌ కోర్సుల్లో 10శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ వర్తింపు తెలంగాణ
    తెలంగాణ: అర్చకులకు గుడ్ న్యూస్.. జీతాలు, ఆలయ నిర్వహణ సాయంపెంపు  తెలంగాణ
    Minority Scholarship Scam: మైనారిటీ స్కాలర్‌షిప్ కుంభకోణం; సీబీఐ కేసు నమోదు  సీబీఐ
    చైనా మ్యాప్‌పై ప్రధాని మోదీ మాట్లాడాల్సిందే: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025