NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మణిపూర్ హింసాకాండ నేపథ్యంలో.. ఎస్‌ఎస్‌పీ శ్రీనగర్‌ రాకేష్ బల్వాల్‌ నియామకం
    తదుపరి వార్తా కథనం
    మణిపూర్ హింసాకాండ నేపథ్యంలో.. ఎస్‌ఎస్‌పీ శ్రీనగర్‌ రాకేష్ బల్వాల్‌ నియామకం
    మణిపూర్ హింసాకాండ నేపథ్యంలో.. ఎస్‌ఎస్‌పీ శ్రీనగర్‌ రాకేష్ బల్వాల్‌ నియామకం

    మణిపూర్ హింసాకాండ నేపథ్యంలో.. ఎస్‌ఎస్‌పీ శ్రీనగర్‌ రాకేష్ బల్వాల్‌ నియామకం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 28, 2023
    11:53 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్,హత్య తర్వాత మణిపూర్ మరో మారు హింసాత్మకంగా మారడంతో, సీనియర్ IPS అధికారి రాకేష్ బల్వాల్‌ను ఈశాన్య రాష్ట్రానికి రప్పించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

    ప్రస్తుతం శ్రీనగర్‌లో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా ఉన్న రాకేష్ బల్వాల్‌ను మణిపూర్‌లోని అతని హోమ్ క్యాడర్‌కు ముందస్తుగా రప్పించాలని కేంద్రం ఆదేశించింది.

    బల్వాల్ ఇప్పుడు మణిపూర్‌లో హింసాకాండతో అల్లాడుతున్న రాష్ట్రానికి సహాయం చేయనున్నారు.

    మణిపూర్‌లో ప్రస్తుతం ఉన్న శాంతిభద్రతల పరిస్థితుల దృష్ట్యా మరింత మంది అధికారుల అవసరాన్ని పేర్కొంటూ,హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిపాదన చేసిన దాదాపు ఒక నెల తర్వాత క్యాబినెట్ నియామకాల కమిటీ దీనిని ఆమోదించింది.

    Details 

    భద్రతా సిబ్బందితో నిరసనకారులు ఘర్షణ 

    జూలైలో అదృశ్యమైన ఫిజామ్ హేమ్‌జిత్ (20),హిజామ్ లింతోంగంబి (17)మృతదేహాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంగళవారం ఇంఫాల్‌లో విద్యార్థుల నేతృత్వంలో తాజాగా హింస చెలరేగింది.

    ఇద్దరిని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చారని విద్యార్థులు ఆరోపించారు. బుధవారం రాత్రి, ఉరిపోక్, యైస్కుల్, సగోల్‌బాండ్, తేరా ప్రాంతాలలో నిరసనకారులు భద్రతా సిబ్బందితో ఘర్షణ పడ్డారు.

    పరిస్థితిని నియంత్రించడానికి బలగాలు అనేక రౌండ్లు టియర్ గ్యాస్ షెల్‌లను కాల్చినట్లు అధికారులు తెలిపారు.

    భద్రతా బలగాలు నివాస ప్రాంతాల్లోకి రాకుండా ఉండేందుకు నిరసనకారులు టైర్లు, బండరాళ్లు, ఇనుప పైపులతో రోడ్లను దిగ్బంధించారు.

    Details 

    హింసాత్మక నిరసనలలో సుమారు 150 మంది విద్యార్థులకు గాయాలు 

    ఒక గుంపు DC కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేసింది. రెండు నాలుగు చక్రాల వాహనాలను తగులబెట్టింది.

    సిఆర్‌పిఎఫ్ సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు వారు తెలిపారు. మంగళవారం హింసాత్మక నిరసనలలో సుమారు 150 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఇంఫాల్ తూర్పు, పశ్చిమ రెండు జిల్లాలలో కర్ఫ్యూ విధించారు.

    ఇద్దరు విద్యార్థులను కిడ్నాప్ చేసి చంపిన వారిని అరెస్టు చేసి శిక్షిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు హామీ ఇచ్చారని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ బుధవారం చెప్పారు.

    ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మణిపూర్
    కేంద్ర హోంశాఖ

    తాజా

    Abhishek Banerjee: యూసుఫ్ పఠాన్ ఔట్, అభిషేక్ బెనర్జీ ' ఇన్‌!.. ఆపరేషన్ సిందూర్' కోసం ఎంపిక తృణమూల్ కాంగ్రెస్‌
    Pahalgam Horror: సైనిక దుస్తుల్లో ఉగ్రవాదుల దాడులు.. భద్రతా బృందాల్లో కలవరం జమ్ముకశ్మీర్
    Stock Market: 800 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్.. 24,700 పాయింట్ల దిగువకు పడిపోయిన నిఫ్టీ.. ఈ ఆకస్మిక పతనానికి కారణాలేంటి?  స్టాక్ మార్కెట్
    Vaibhav vs Dhoni: ఒకరు ఫినిషింగ్ మాస్టర్, మరొకరు ఓపెనింగ్ స్పెషలిస్ట్.. ఎవరిది పైచేయి? రాజస్థాన్ రాయల్స్

    మణిపూర్

    Manipur:హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌ కి విపక్ష నేతల బృందం  ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్
    మణిపూర్ వైరల్ వీడియో కేసులో కీలక మలుపు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ సీబీఐ
    Opposition in Manipur: మణిపూర్‌లో గవర్నర్‌ను కలిసిన ప్రతిపక్ష కుటమి ఎంపీలు ప్రతిపక్షాలు
    Manipur viral video: సుప్రీంకోర్టును ఆశ్రయించిన మణిపూర్ లైంగిక వేధింపుల బాధితులు; నేడు విచారణ సుప్రీంకోర్టు

    కేంద్ర హోంశాఖ

    పోలీసు పతకాలను ప్రకటించిన కేంద్ర హోంశాఖ.. తెలుగు రాష్ట్రాలలో ఎంతమందికంటే..? పోలీస్ మెడల్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025