Madhya Pradesh: మధ్యప్రదేశ్ కేబినెట్ విస్తరణ.. ఓబీసీ కేటగిరీ నుంచి 11 మంది
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ పటేల్ సోమవారం కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. మధ్యప్రదేశ్ మంత్రివర్గంలోకి మొత్తం 28 మంది బీజేపీ నేతలు చేరారు. ప్రధుమన్ సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, కైలాష్ విజయవర్గియా, విశ్వాస్ సారంగ్ సహా 18 మంది నేతలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర మంత్రులుగా (స్వతంత్ర బాధ్యతలు) ఆరుగురు నేతలు, రాష్ట్ర మంత్రులుగా నలుగురు నేతలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ కూడా హాజరయ్యారు. అటల్ జీ జన్మదినం రోజున కొత్త ప్రభుత్వం ఏర్పడడం మధ్యప్రదేశ్ అదృష్టమని శివరాజ్సింగ్ చౌహాన్ అన్నారు.