NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi Police: పౌరసత్వానికి ఆధార్, పాన్, రేషన్ కార్డులు చెల్లవు.. ఢిల్లీ పోలీసుల కొత్త నిబంధన!
    తదుపరి వార్తా కథనం
    Delhi Police: పౌరసత్వానికి ఆధార్, పాన్, రేషన్ కార్డులు చెల్లవు.. ఢిల్లీ పోలీసుల కొత్త నిబంధన!

    Delhi Police: పౌరసత్వానికి ఆధార్, పాన్, రేషన్ కార్డులు చెల్లవు.. ఢిల్లీ పోలీసుల కొత్త నిబంధన!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 05, 2025
    05:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో అనధికారికంగా నివసిస్తున్న వలసదారులపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది.

    తాజా ఆదేశాల ప్రకారం, ఆధార్, పాన్, రేషన్ కార్డులను ఇకపై భారతీయ పౌరసత్వానికి ఆధారంగా పరిగణించమని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.

    ముఖ్యంగా బంగ్లాదేశ్, రోహింగ్యా వలసదారులు ఈ డాక్యుమెంట్లను సృష్టించి తప్పుడు పౌరసత్వాన్ని చూపిస్తున్నారని అధికారులు తెలిపారు.

    Details

    శరణార్థులకు భారత ప్రభుత్వం గుర్తింపు లేకుండా రక్షణ లేదు

    UNHCR జారీ చేసిన శరణార్థి కార్డులు కలిగిన వ్యక్తులు కొందరు ఉననా, సరైన ట్రావెల్ డాక్యుమెంట్లు లేకుండా వారికి భారతదేశంలో చట్టబద్ధంగా నివాసం ఉండే హక్కు లేదని అధికారులు స్పష్టం చేశారు.

    శరణార్థి గుర్తింపు ఉన్నా, భారత ప్రభుత్వ అధికారిక అనుమతి లేకపోతే వారికి డిపోర్టేషన్ (నిర్వాసనం) నుండి రక్షణ ఉండదని చెప్పారు.

    ఏప్రిల్ చివరలో అమల్లోకి వచ్చిన ఈ కొత్త విధానం కింద, ఢిల్లీలోని అన్ని జిల్లాల్లో నిఘా పెంచారు. ప్రతి జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్‌ కు అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారు.

    Details

    చెల్లుబాటు అయ్యే పౌరసత్వ పత్రాలు ఇవే

    ఈ కఠినమైన ధృవీకరణ ప్రక్రియలో భారత ఓటర్ ID కార్డు లేదా పాస్‌పోర్ట్ మాత్రమే భారతీయ పౌరసత్వాన్ని నిర్ధారించే చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లుగా పరిగణించారు.

    ఆధార్, పాన్, రేషన్ కార్డులు ఇకనుంచి పౌరసత్వానికి నిబంధనల ప్రకారం చెల్లవు.

    న్యాయ మార్గమే పరిష్కారం

    తమకు చెల్లుబాటు అయ్యే పత్రాలు ఉన్నాయని భావించే వ్యక్తులు, వాటిని తిరస్కరించినపుడు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని అధికారులు తెలిపారు.

    Details

    పాకిస్థానీయులపై ప్రత్యేక నిఘా

    ఇటీవలి జమ్ముకశ్మీర్ ఉగ్రవాద దాడిలో 28 మంది పర్యాటకులు మరణించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

    ఆ ఘటన తరువాత పాకిస్థాన్ పౌరులకు ఇచ్చిన వీసాలన్నింటినీ, మెడికల్, డిప్లొమాటిక్, దీర్ఘకాలిక వీసాల మినహాయింపుతో, రద్దు చేసింది.

    ఏప్రిల్ 29 తర్వాత ఇచ్చిన మెడికల్ వీసాలనూ నిలిపివేసింది.

    దీనివల్ల ఢిల్లీలో ఉన్న సుమారు 3,500 పాకిస్తాన్ పౌరులలో 520 మంది ముస్లిం వలసదారులు ఉన్నట్లు గుర్తించగా, వారిలో 400 మంది ఇప్పటికే అటారి సరిహద్దు మార్గంగా పాకిస్థాన్ తిరిగి వెళ్లిపోయారని ఢిల్లీ పోలీస్ వర్గాలు వెల్లడించాయి.

    Details

    అక్రమ వలసదారులపై ఉక్కుపాదం

    పోలీసు, ఇంటెలిజెన్స్ సంస్థలు కలసి అక్రమ వలసదారులను గుర్తించి దేశ బహిష్కరణ చర్యలు చేపడుతున్నాయి. వచ్చే వారాల్లో ఈ మిషన్ మరింత వేగవంతం కానుందని సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    భారతదేశం

    తాజా

    Nandigam Suresh: టీడీపీ కార్యకర్తపై దాడి.. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు వైసీపీ
    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా
    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా

    దిల్లీ

    Delhi Rain: దిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు భారీ వర్షాలు
    Delhi: 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఇకపై ఇంధనం అందదు కేంద్ర ప్రభుత్వం
    Rekha Gupta: అనుభవం లేకపోయినా ముఖ్యమంత్రి.. షాయారీతో సమాధానమిచ్చిన దిల్లీ సీఎం రేఖా గుప్తా  భారతదేశం
    IFS officer suicide: భవనంపై నుంచి దూకి.. ఐఎఫ్ఎస్ అధికారి ఆత్మహత్య విదేశాంగశాఖ

    భారతదేశం

    S Jaishankar: భారత ప్రయోజనాలే ప్రాధాన్యం.. వాణిజ్య ఒప్పందాలపై జైశంకర్ స్పష్టత భారతదేశం
    India-US: ఎగుమతులను కాపాడుకునేందుకు..US దిగుమతులపై సుంకం తగ్గింపు  అమెరికా
    India Us Trade: భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు.. హార్లీ డేవిడ్సన్ బైక్స్, బోర్బన్ విస్కీపై సుంకాల కోత.. బిజినెస్
    CareEdge Ratings: దేశంలోని వివిధ రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై ర్యాంకులు..    ఆంధ్ర ర్యాంక్ ఎంతంటే?: కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025