NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AAP: దిల్లీ ఎన్నికల్లో ఓటమితో ఆప్‌కి షాక్.. పంజాబ్‌లో మోడల్ మార్చక తప్పదా?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    AAP: దిల్లీ ఎన్నికల్లో ఓటమితో ఆప్‌కి షాక్.. పంజాబ్‌లో మోడల్ మార్చక తప్పదా?
    దిల్లీ ఎన్నికల్లో ఓటమితో ఆప్‌కి షాక్.. పంజాబ్‌లో మోడల్ మార్చక తప్పదా?

    AAP: దిల్లీ ఎన్నికల్లో ఓటమితో ఆప్‌కి షాక్.. పంజాబ్‌లో మోడల్ మార్చక తప్పదా?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 09, 2025
    04:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జాతీయ పార్టీ స్థాయిని సాధించిన ఆమ్‌ఆద్మీ పార్టీకి దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది.

    దేశవ్యాప్తంగా 'దిల్లీ మోడల్‌'ను ప్రచారం చేసిన ఆ పార్టీకి స్వయంగా దిల్లీ ప్రజలే తిరస్కరణ పలకడంతో, భవిష్యత్ కార్యాచరణపై పునరాలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    ప్రస్తుతం పంజాబ్‌లో మాత్రమే అధికారంలో ఉన్న ఆప్, అక్కడ తన పాలన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

    దిల్లీ మోడల్‌ను దిల్లీ ప్రజలే తిరస్కరించేశారు. అదే మోడల్‌ను అమలు చేస్తున్న పంజాబ్‌లో ప్రజలు ఎలా స్వీకరిస్తారు?'' అని పంజాబ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్ షాహీద్ భగత్ ప్రశ్నించారు.

    Details

    ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక అవసరం

    ఇదే విషయాన్ని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఛైర్మన్‌ ప్రమోద్ కుమార్ కూడా సూచిస్తూ, పంజాబ్ కోసం ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక అవసరమని తెలిపారు.

    దిల్లీ మాదిరిగా పంజాబ్‌లో ఉచిత కరెంటు, మహిళలకు నెలకు రూ. 1000 ఆర్థిక సాయం, మెరుగైన విద్యా, ఆరోగ్య సదుపాయాలను హామీగా ఇచ్చి 2022లో 117 స్థానాల్లో 92 స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చిన ఆప్, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కేవలం 13 స్థానాలకు గాను 3 స్థానాల్లోనే గెలిచింది.

    దిల్లీ ఎన్నికల్లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్, మంత్రులు, ఆప్ అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ, ప్రజలు ఆశించిన విధంగా స్పందించలేదు.

    Details

    పంజాబ్ లో సవాళ్లు ఎదురయ్యే అవకాశం

    దీంతో రానున్న రోజుల్లో పంజాబ్‌లో ఆప్‌కు సవాళ్లు ఎదురయ్యే అవకాశముందన్నారు.

    2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు విపక్షాలకు ఇది మంచి అవకాశం కల్పించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

    ఈ పరిస్థితుల్లో ఆప్ నేతలు ప్రలోభాలకు గురికాకుండా పార్టీని ఎంత పటిష్ఠంగా ఉంచగలరో అనేదే భవిష్యత్‌ను నిర్ణయించనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    తాజా

    Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక పవన్ కళ్యాణ్
    ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్ ఇంగ్లండ్
    Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు! బెంగళూరు
    Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే? కమల్ హాసన్

    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    Atishi Marlena: నాతో సహా నలుగురిని అరెస్టు చేయాలని బీజేపీ చూస్తోంది: అతీషి భారతదేశం
    PM Modi degree Row: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు భారీ షాక్.. ప్రధాని మోదీ డిగ్రీ కేసులో పిటిషన్‌ తిరస్కరణ సుప్రీంకోర్టు
    Raaj Kumar Anand: ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్.. మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ రాజీనామా దిల్లీ
    President Rule: ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టి రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది: అతిషి  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025