Page Loader
Punjab: ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడంతో ఆప్ ఎమ్మెల్యే మృతి
ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడంతో ఆప్ ఎమ్మెల్యే మృతి

Punjab: ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడంతో ఆప్ ఎమ్మెల్యే మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 11, 2025
08:52 am

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్‌లోని లుథియానా వెస్ట్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ గోగీ (58) అనుమానాస్పద స్థితిలో మరణించారు. అధికారుల సమాచారానుసారం, శుక్రవారం అర్ధరాత్రి గుర్‌ప్రీత్ గోగీకి తుపాకీ గాయాలయ్యాయి. ఆయనను ఆసుపత్రికి తరలించే ముందు ప్రాణాలు కోల్పోయారు. ఆయన తలలో రెండు బుల్లెట్ గాయాలున్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇది ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడం వల్ల జరిగిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు డీసీపీ కుల్దీప్ సింగ్‌ చాహల్‌ తెలిపారు. 2022లో ఆప్ పార్టీలో చేరిన గోగీ, లుథియానా నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆప్ ఎమ్మెల్యే మృతి