NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sunitha Kejriwal: ఆప్ తరపున సునీతా కేజ్రీవాల్ ప్రచారం.. గుజరాత్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల 
    తదుపరి వార్తా కథనం
    Sunitha Kejriwal: ఆప్ తరపున సునీతా కేజ్రీవాల్ ప్రచారం.. గుజరాత్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల 
    ఆప్ తరపున సునీతా కేజ్రీవాల్ ప్రచారం.. గుజరాత్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల

    Sunitha Kejriwal: ఆప్ తరపున సునీతా కేజ్రీవాల్ ప్రచారం.. గుజరాత్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 16, 2024
    04:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఢిల్లీ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కటకటాల పాలయ్యారు. జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తానని సీఎం తెలిపారు.

    ఇదిలా ఉంటే, 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఆప్ గుజరాత్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది.

    ఈ జాబితాలో సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్, సంజయ్ సింగ్,రాఘవ్ చద్దా,సౌరభ్ భరద్వాజ్,అతిషి, సందీప్ పాఠక్ పేర్లు కూడా ఉన్నాయి. ఇందులో భగవంత్ మాన్,మనీష్ సిసోడియా,సత్యేంద్ర జైన్ కూడా ఉన్నారు.

    జాబితా వెలువడిన తర్వాత తీహార్ జైలులో ఉన్న పార్టీ అధినేత, సీఎం కేజ్రీవాల్ పేరు కూడా ఈ జాబితాలో చేరడం చర్చనీయాంశంగా మారింది.

    ఆయన జైల్లో ఉంటే గుజరాత్‌లో పార్టీ తరపున ఎలా ప్రచారం చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్న.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

     క్యాంపెయినర్ల జాబితా ఇదే..

    AAP's Star Campaigner list for Gujarat-Loksabha elections. pic.twitter.com/Clw2NCvVLi

    — Darshan Pathak (@darshanpathak) April 16, 2024

    Details 

    ఏప్రిల్ 23 వరకు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ

    దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కాగా.. ఏప్రిల్ 26న సెకండ్ విడత, మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది.ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.

    ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయస్థానం రెండు సార్లు ఈడీ కస్టడీకి ఇవ్వగా చివరిసారిగా ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు.

    అనంతరం బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లినా నిరాశే ఎదురైంది.తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 23 వరకు పొడిగించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    గుజరాత్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    లోక్‌సభలో దుమారం.. కేంద్రమంత్రి నారాయణ రానే పై విపక్షాలు ధ్వజం లోక్‌సభ
    బీజేపీపై ఆప్ ఎంపీ సంచలన ఆరోపణలు.. తనను మరో రాహుల్ గాంధీ చేసేందుకు కుట్ర భారతదేశం
    ఆప్ ఎంపీపై సస్పెన్షన్ వేటు.. కారణమిదే? రాజ్యసభ
    చండీగఢ్- మొహాలి సరిహద్దులో హై అలర్డ్ ; ఆగస్టు 15న ఖలిస్థాన్ గ్రూప్ 'కిమ్' ర్యాలీ  చండీగఢ్

    గుజరాత్

    బిల్కిస్ బానో నిందితుల విడుదలపై సుప్రీం ప్రశ్నల వర్షం.. విచారణ 24కు వాయిదా సుప్రీంకోర్టు
    గుజరాత్‌లో తప్పిన రైలు ప్రమాదం.. పట్టాలపై అడ్డంగా ఇనుప స్తంభాలు రైలు ప్రమాదం
    గుజరాత్ వెళ్తున్నారా? జీఐ ట్యాగ్ పొందిన వస్తువులు కొనండి  పర్యాటకం
     9 Vande Bharat trains launched:  తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025