NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Vizag Steel:విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Vizag Steel:విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు 
    విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం..300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు

    Vizag Steel:విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 19, 2025
    08:37 am

    ఈ వార్తాకథనం ఏంటి

    విశాఖపట్టణంలోని ఉక్కు కర్మాగారంలో ఆదివారం మధ్యాహ్నం ప్రమాదం చోటుచేసుకుంది.

    ఈ ఘటనలో బ్లాస్ట్ ఫర్నెస్-2 నుంచి సుమారు 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపైకి కారడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

    సాధారణ ప్రక్రియ ప్రకారం, బ్లాస్ట్ ఫర్నెస్ నుంచి ఉత్పత్తి అయ్యే ద్రవ ఉక్కును టర్బో ల్యాడిల్ కార్‌ (TLC) లోకి నింపి, అక్కడి నుంచి స్టీల్ మెల్టింగ్ షాప్‌(SMS)కు తరలించే ఏర్పాట్లు చేశారు.

    అయితే ఈ ప్రక్రియలో అకస్మాత్తుగా టీఎల్‌సీ కార్‌లో రంధ్రం ఏర్పడింది. దాంతో అందులో ఉన్న ద్రవ ఉక్కు ఒక్కసారిగా కిందకు జారిపడి, నేలపైకి వ్యాపించింది.

    ఈ ఘటన కారణంగా అక్కడి ట్రాక్ పై ఉన్న కేబుల్స్ పూర్తిగా కాలిపోయాయి. ట్రాక్ కూడా తీవ్రంగా దెబ్బతింది.

    వివరాలు 

    ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు 

    అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

    విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటల్ని అదుపు చేశారు.

    అనంతరం ట్రాక్‌పై కారిన ఉక్కును, టీఎల్‌సీ కార్‌ను తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు.

    ఇటీవలే టీఎల్‌సీకి రిఫ్రాక్టరీ లైనింగ్ వేయడం జరిగింది. సాధారణంగా ఆ లైనింగ్‌ సుమారు 1,050 హీట్ల వరకూ సేవలందించగలగాలి.

    వివరాలు 

    500 హీట్లు పూర్తవకముందే రంధ్రం

    కానీ ఈ ఘటనలో అది కేవలం 500 హీట్లు పూర్తవకముందే రంధ్రం పడిపోవడం ద్వారా,లైనింగ్ పనుల్లో నాణ్యతా లోపం ఉన్నట్లు భావిస్తున్నారు.

    దీనిపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు.

    ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు మరల జరగకుండా చూసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అనుభవం కలిగిన నిపుణులతోనే ఇటువంటి బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉందని స్టీల్ ఇంటక్ అధ్యక్షుడు పి.వి. రమణమూర్తి, సీటూ ప్రధాన కార్యదర్శి యు. రామస్వామి డిమాండ్ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం

    తాజా

    Vizag Steel:విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు  విశాఖపట్టణం
    Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' దాడులకు సంబంధించిన కొత్త వీడియోను షేర్ చేసిన భారత సైన్యం  ఆపరేషన్‌ సిందూర్‌
    Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ జో బైడెన్
    Motivation : మనల్ని మనం జయించగలిగితేనే ప్రపంచాన్ని జయించగలం జీవనశైలి

    విశాఖపట్టణం

    Navy maneuvers: నేడు, రేపు విశాఖతీరంలో ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్ల విన్యాసాలు నౌకాదళం
    Visakha Cruise Terminal: పూర్తి హంగులతో సిద్ధమైన విశాఖ క్రూజ్‌ టెర్మినల్‌..   భారతదేశం
    Vizag: నేవీ సన్నాహక విన్యాసాల్లో అపశ్రుతి.. ప్యారాచూట్లు చిక్కుకుని .. సముద్రంలో పడిన నావికులు భారతదేశం
    PM Modi Vizag Tour: ప్రధాని మోడీ విశాఖ పర్యటన కోసం భారీ ఏర్పాట్లు.. రోడ్ షో, సభపై ప్రత్యేక దృష్టి నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025