NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / SLBC: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం.. పైకప్పు కూలి గాయపడిన కార్మికులు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    SLBC: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం.. పైకప్పు కూలి గాయపడిన కార్మికులు
    ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం.. పైకప్పు కూలి గాయపడిన కార్మికులు

    SLBC: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం.. పైకప్పు కూలి గాయపడిన కార్మికులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 22, 2025
    01:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నాగర్‌ కర్నూల్‌ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మూడు మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది. ఎడమవైపు సొరంగ మార్గంలోని 14వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

    ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఇటీవల పనులను తిరిగి ప్రారంభించింది. నాలుగు రోజుల క్రితం ఈ పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఉదయం ప్రమాదం సంభవించింది.

    అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

    Details

    ప్రమాద సమయంలో టన్నెల్‌లో 40 మంది కార్మికులు 

    శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల నుంచి నల్గొండ జిల్లాకు సాగు, తాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు.

    ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద సొరంగ మార్గం నిర్మాణం కొనసాగుతోంది.

    ప్రమాదం సంభవించిన సమయంలో 40 మంది కార్మికులు మొదటి షిఫ్ట్‌లో సొరంగంలో ఉన్నారు. ఉదయం 8:30 గంటల సమయంలో పైకప్పు కూలిపోవడంతో మట్టిపెల్లలు విరిగి కార్మికులపై పడ్డాయి.

    దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, ఏడుగురు కార్మికులు లోపల చిక్కుకున్నట్లు సమాచారం. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.

    Details

    సీఎం రేవంత్ రెడ్డి స్పందన 

    ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అధికారులను సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

    నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, నీటిపారుదల శాఖ అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

    మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఘటనాస్థలికి బయలుదేరారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రేవంత్ రెడ్డి
    తెలంగాణ

    తాజా

    Kamal Haasan: 'థగ్ లైఫ్‌' విడుదల కోసం హైకోర్టును ఆశ్రయించిన కమల్‌ హాసన్‌! కమల్ హాసన్
    Success Tips: ఓటములతో కుంగిపోతున్నారా? ఇలా చేస్తే విజయం మీదే ! జీవనశైలి
    Klaasen Retirement: సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్లాసెన్ రిటైర్మెంట్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు సౌత్ ఆఫ్రికా
    India EV Policy 2025: పెద్ద పెట్టుబడులు, తక్కువ పన్నులు ఆటో మొబైల్

    రేవంత్ రెడ్డి

    CM Revanthreddy: సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలు : రేవంత్ రెడ్డి కీలక ప్రకటన తెలంగాణ
    CM Revanth Reddy: సిద్దిపేటలో కోకాకోలా పరిశ్రమను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ
    Revanth Reddy: ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి భారతదేశం
    Telangana Thalli Statue: లక్షలాది మహిళల సమక్షంలో నేడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ తెలంగాణ

    తెలంగాణ

    Bhu Bharati: వారసత్వ భూ బదిలీకి ఆన్లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ.. చట్టంలోని అంశాల ఆధారంగా ఐచ్ఛికాలు భారతదేశం
    Telangana Govt-CRISP: మంత్రి సీతక్కతో క్రిస్ప్ సెక్రటరీ భేటీ.. ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్న క్రిస్ప్ భారతదేశం
    Telangana: పీజీ మెడికల్‌ సీట్లలో స్థానిక కోటా రద్దు... సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం పోరాటం సుప్రీంకోర్టు
    Medaram Jatara 2025: సమ్మక్క-సారలమ్మ మినీ జాతర ప్రారంభం.. లక్షలాదిమంది భక్తుల రాక ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025