NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Operation Sindoor: ఆపరేషన్ కవరేజీలో బాధ్యతాయుతంగా వ్యవహరించండి.. మీడియాకు రక్షణశాఖ హెచ్చరిక
    తదుపరి వార్తా కథనం
    Operation Sindoor: ఆపరేషన్ కవరేజీలో బాధ్యతాయుతంగా వ్యవహరించండి.. మీడియాకు రక్షణశాఖ హెచ్చరిక
    ఆపరేషన్ కవరేజీలో బాధ్యతాయుతంగా వ్యవహరించండి.. మీడియాకు రక్షణశాఖ హెచ్చరిక

    Operation Sindoor: ఆపరేషన్ కవరేజీలో బాధ్యతాయుతంగా వ్యవహరించండి.. మీడియాకు రక్షణశాఖ హెచ్చరిక

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 09, 2025
    03:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారం విషయంలో మీడియా సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని రక్షణ శాఖ స్పష్టం చేసింది.

    భద్రతా దళాల కదలికలు, ఆపరేషన్ల కవరేజీ విషయంలో జాగ్రత్తలు పాటించాలని కోరింది.

    'దళాల ఆపరేషన్లకు సంబంధించిన వివరాలను ఓవరాకింగ్‌గా ప్రచురిస్తే... అది వారి మిషన్‌పై ప్రభావం చూపించడమే కాకుండా, ప్రాణహానికీ దారి తీసే ప్రమాదం ఉందని ఓ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

    ఇటీవల జరిగిన కార్గిల్‌ యుద్ధం, 26/11 ముంబై ఉగ్రదాడులు, కాందహార్ హైజాక్‌ ఘటనల సమయంలో జరిగిన అత్యుత్సాహపు రిపోర్టింగ్‌ ఉదాహరణలుగా నిలిచినట్లు తెలిపింది.

    Details

    మీడియా ప్రతినిధులు బాధ్యతయుతంగా వ్యవహరించాలి

    కేబుల్‌ టెలివిజన్‌ చట్టాన్ని ఉల్లేఖించిన రక్షణశాఖ, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల సమయంలో నిబంధనల ప్రకారం కేవలం అర్హత గల అధికారులే సమయానుసారంగా అధికారికంగా వివరాలు వెల్లడించవచ్చని స్పష్టం చేసింది.

    మీడియా ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరింది. ఇంతకుముందు కార్వార్‌, గుజరాత్‌లోని ఓ పోర్టు, జలంధర్‌లో డ్రోన్‌లు, క్షిపణుల దాడుల దృశ్యాలంటూ కొన్ని పాక్ అనుకూల సోషల్ మీడియా ఖాతాలు వీడియోలు షేర్‌ చేసిన విషయం తెలిసిందే.

    కేంద్ర ప్రభుత్వం ఈ తప్పుడు ప్రచారాలను అడ్డుకునేందుకు చర్యలు ప్రారంభించింది.

    'ఆపరేషన్ సిందూర్' సమయంలో దేశవ్యాప్తంగా తప్పుడు వార్తలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

    ఈ క్రమంలో పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం క్లారిటీ ఇస్తూ, సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న కొన్ని వీడియోలు అవాస్తవమని తేల్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సోషల్ మీడియా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Operation Sindoor: ఆపరేషన్ కవరేజీలో బాధ్యతాయుతంగా వ్యవహరించండి.. మీడియాకు రక్షణశాఖ హెచ్చరిక సోషల్ మీడియా
    Ministry of Home Affairs: రాష్ట్ర కేంద్రపాలిత ప్రధాన కార్యదర్శులు, నిర్వాహకులకు హోం మంత్రిత్వ శాఖ లేఖ కేంద్ర హోంశాఖ
    Indus Waters Treaty: 'మాది సహాయక పాత్ర మాత్రమే': సింధు జలాల ఒప్పందం సస్పెన్షన్‌పై ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా అజయ్ బంగా
    Thug Life: దేశ భద్రత ముందు వేడుకలకు బ్రేక్.. 'థగ్ లైఫ్' ఆడియో ఈవెంట్ వాయిదా! కమల్ హాసన్

    సోషల్ మీడియా

    5 శాతం మంది ఉద్యోగులకు తొలగించిన రెడ్డిట్  ఉద్యోగుల తొలగింపు
    ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్ట్; కొల్హాపూర్‌లో నిరసనలు; పోలీసుల లాఠీ‌ఛార్జ్  మహారాష్ట్ర
    స్విగ్గీ డెలివరీ బాయ్‌గా మారిన ఇంజనీర్‌కు లింక్డ్‌ఇన్‌లో పోటెత్తిన ఉద్యోగాలు  స్విగ్గీ
    15 ఏళ్ల సీఈఓను బ్యాన్ చేసిన లింక్డ్‌ఇన్, కారణం ఇదే అమెరికా

    కేంద్ర ప్రభుత్వం

    OTT Platforms: రణవీర్ అల్హాబాదియా వ్యాఖ్యల నేపథ్యంలో.. ఓటీటీలకు కేంద్రం హెచ్చరికలు జారీ  ఓటిటి
    IAF: భారత వాయుసేనకు తేజస్‌ కష్టాలకు చెక్‌ .. హైలెవల్‌ ప్యానెల్‌ను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం భారతదేశం
    Universal Pension Scheme: భారతీయులందరికీ కొత్త 'యూనివర్సల్ పెన్షన్ స్కీమ్'.. కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం బిజినెస్
    Supreme Court: దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై ఆరేళ్ల నిషేధం చాలు.. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్‌ సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025