NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Vishal : సెన్సార్ బోర్డుపై నటుడు విశాల్ ఆరోపణలు.. విచారణ మొదలు పెట్టనున్న సీబీఐ
    తదుపరి వార్తా కథనం
    Vishal : సెన్సార్ బోర్డుపై నటుడు విశాల్ ఆరోపణలు.. విచారణ మొదలు పెట్టనున్న సీబీఐ
    సెన్సార్ బోర్డుపై నటుడు విశాల్ ఆరోపణలు.. విచారణ మొదలు పెట్టనున్న సీబీఐ

    Vishal : సెన్సార్ బోర్డుపై నటుడు విశాల్ ఆరోపణలు.. విచారణ మొదలు పెట్టనున్న సీబీఐ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 05, 2023
    03:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కొద్ది రోజుల క్రితం సెన్సార్ బోర్డు అధికారులపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

    సెన్సార్ బోర్డు అవినీతిమయమైందంటూ నటుడు విశాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

    తాజాగా ఈ వ్యవహారంపై విచారణకు సీబీఐ రంగంలోకి దిగింది.

    అతను చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ మొదలు పెట్టింది. ఈ కేసులో ముగ్గురు ప్రయివేటు వ్యక్తులతో పాటు పలువురు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పిల్మ్ సర్టిఫికేషన్ అధికారులపై కేసు ఫైల్ అయింది.

    నిందితుల ఇళ్లలో ఇప్పటికే సోదాలు కూడా మొదలుపెట్టినట్లు అధికారులు వెల్లడించారు.

    ముంబై సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ కార్యాలయంలో సినిమా సర్టిఫికేషన్ కోసం లంచం తీసుకోవడం ఏంటని విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    Details

    విశాల్ ఆరోపణలపై స్పందించిన కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

    ముంబైలోని సీబీఎఫ్‌సీ కార్యాలయంలో 'మార్క్ ఆంటోని' హిందీ వెర్షన్ రిలీజ్ కోసం రూ.6.5 లక్షలు లంచం చెల్లించాల్సి వచ్చిందని, తానే రెండు సార్లు లంచం ఇచ్చానని విశాల్ పేర్కొన్నారు.

    తన సినీ కెరీర్‌లో ఇప్పటివరకూ ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదని, ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తా అంటూ వీడియోలో వెల్లడించారు.

    ఇక విశాల్ ఆరోపణలపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పందించింది.

    సినిమా సర్టిఫికేషన్ కోసం లంచం అడగడం దారుణమని, కేంద్ర ప్రభుత్వం అవినీతిని ఏ మాత్రం సహించదని, దీని వెనుక ఎవరి ప్రమేయం ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాల్
    సీబీఐ

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    విశాల్

    మార్క్ ఆంటోనీ సాంగ్ అప్డేట్: తెలుగు మార్కెట్ పై ఫోకస్ పెట్టిన విశాల్  సినిమా
    మార్క్ ఆంటోనీ విడుదలకు లైన్ క్లియర్: సినిమాను రిలీజ్ చేసుకోవచ్చని కోర్టు తీర్పు  తెలుగు సినిమా
    హీరో విశాల్ లంచం ఆరోపణలపై కేంద్రం సీరియస్‌‌.. అవినీతిని సహించేది లేదని స్పష్టం కేంద్ర ప్రభుత్వం

    సీబీఐ

    తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్ నితీష్ కుమార్
    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్: లాలూ, రబ్రీ దేవి, మిసా భారతికి రూ.50వేల పూచీకత్తుపై బెయిల్ లాలూ ప్రసాద్ యాదవ్
    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు మరోసారి సమన్లు జారీ చేసిన సీబీఐ తేజస్వీ యాదవ్
    జైలులో ఉన్న ఆప్ నేత మనీష్ సిసోడియాపై సీబీఐ మరో కేసు మనీష్ సిసోడియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025