NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ప్రజల్ని మోసగించలేకే బీఆర్ఎస్ ను వదిలేస్తున్నా: కేసీఆర్ సన్నిహితుడు కుచాడి శ్రీహరిరావు
    తదుపరి వార్తా కథనం
    ప్రజల్ని మోసగించలేకే బీఆర్ఎస్ ను వదిలేస్తున్నా: కేసీఆర్ సన్నిహితుడు కుచాడి శ్రీహరిరావు
    ప్రజల్ని మోసగించలేకే బీఆర్ఎస్ ను వదిలేస్తున్నా : కేసీఆర్ సన్నిహితుడు కుచాడి శ్రీహరిరావు

    ప్రజల్ని మోసగించలేకే బీఆర్ఎస్ ను వదిలేస్తున్నా: కేసీఆర్ సన్నిహితుడు కుచాడి శ్రీహరిరావు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 13, 2023
    05:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత, సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కూచాడి శ్రీహరిరావు అధికార పార్టీకి బైబై చెప్పారు.

    ఈ నేపథ్యంలో పార్టీకి జిల్లాలో భారీ షాక్ కు గురైంది. ఈ మేరకు కూచాడి శ్రీహరిరావు కాంగ్రెస్ పార్టీలో చేరనునున్నారని సమాచారం.

    ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన మహోద్యమంలో ముందు వరుసలో నిలబడి పోరాడినప్పటికీ నిజమైన ఉద్యమకారులకు పార్టీలో స్థానం లేదని శ్రీనివాస రావు భావిస్తున్నారు. నిఖార్సైన ఉద్యమకారులకు గుర్తింపు లేకపోవడం మూలానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

    DETAILS

    బీఆర్ఎస్ పార్టీ ప్రజలను వంచించింది: శ్రీహరిరావు

    ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శ్రీహరిరావు జడ్పీ ఫ్లోర్ లీడర్ గా, అప్పటి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించడం గమనార్హం. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రంలో తన అనుచరులతో కలిసి ఆయన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

    కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నామని ప్రకటన చేశారు. అనేక హామీలతో తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ ప్రజలను వంచించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

    ప్రజలను మోసగించడం ఇష్టం లేకనే అధికార పార్టీకి రాజీనామా చేస్తున్నానని శ్రీహరిరావు స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కి తన రాజీనామా లేఖను సమర్పించారు.

    DETAILS

    భాజపా టచ్ లోకి వచ్చినా కాంగ్రెస్ పార్టీవైపే మొగ్గు

    సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చింది ప్రజల కోసమేనని, ఈ మేరకు ఆ సత్యాన్ని గుర్తించిన జనం ఆమెకి మద్దతు పలుకుతున్నారన్నారు.

    తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని వివరించారు. జూన్ 17 లోగా శ్రీహరి రావు కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

    తెలంగాణ ఉద్యమ కాలం 2007లో శ్రీహరిరావు అప్పటి తెరాసలో చేరారు. ఈ క్రమంలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా ఆయన వ్యవహరించారు.

    ఎక్కడ బహిరంగ సభ నిర్వహించినా శ్రీహరిరావుతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని అప్పటి ఉద్యమ నేత కేసీఆర్ తో పంచుకునేవారు.

    గతంలో భాజపా నేతలు కూడా శ్రీహరి రావుతో చర్చలు జరిపారని, అయితే శ్రీహరిరావు మాత్రం హస్తం గూటికి చేరేందుకే మొగ్గు చూపడం కొసమెరుపు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    తెలంగాణ రాష్ట్ర సమితి/ టీఆర్ఎస్
    ప్రభుత్వం

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    తెలంగాణ

    ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రిచెస్ట్ ఉమెన్! ఎవరీ మహిమా దాట్ల? ఆంధ్రప్రదేశ్
    తెలంగాణలో ఆర్టీఏ సర్వర్ డౌన్; నిలిచిపోయిన వాహనాల రిజిస్ట్రేషన్  రవాణా శాఖ
    తెలంగాణలో తప్పనిసరిగా సందర్శించే ఈ టూరిస్టు ప్రదేశాల గురించి తెలుసుకోండి పర్యాటకం
    విద్యార్థులకు 1.17కోట్ల నోట్‌బుక్‌లను ఉచితంగా అందించనున్న తెలంగాణ ప్రభుత్వం  తాజా వార్తలు

    తెలంగాణ రాష్ట్ర సమితి/ టీఆర్ఎస్

    తెలంగాణాలో రూ.21,400 కోట్ల పెట్టుబడులు : కేటీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సమన్లు జారీ చేసిన ఈడీ కల్వకుంట్ల కవిత
    మాజీ మంత్రి విజయరామారావు కన్నుమూత; సీఎం కేసీఆర్ సంతాపం తెలంగాణ
    బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో జరిగిన ఘోరం: సిలిండర్ పేలుడుతో భారీ ప్రమాదం  తెలంగాణ

    ప్రభుత్వం

    2023 ఫారిన్ ట్రేడ్ పాలసీని ఆవిష్కరించిన కేంద్ర ప్రభుత్వం వ్యాపారం
    ప్రభుత్వాస్పత్రి నుంచి నవజాత శిశువును ఈడ్చుకెళ్లిక కుక్క; చిన్నారి మృతి కర్ణాటక
    ముడిచమురుపై విండ్ ఫాల్ పన్నును సున్నాకి తగ్గించిన కేంద్రం ప్రకటన
    వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు; క్లారిటీ ఇచ్చిన కేంద్రం  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025