NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Operation Bhediya: యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు.. తోడేళ్లు కనిపిస్తే కాల్చేయండి 
    తదుపరి వార్తా కథనం
    Operation Bhediya: యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు.. తోడేళ్లు కనిపిస్తే కాల్చేయండి 

    Operation Bhediya: యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు.. తోడేళ్లు కనిపిస్తే కాల్చేయండి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 03, 2024
    02:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహరాయిచ్ జిల్లాను తోడేళ్ల గుంపు భయబ్రాంతులకు గురిచేస్తోంది. గత కొన్నినెలలుగా మహసి ప్రాంతంలో ఈ జీవాల వరుస దాడుల వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయారు.

    ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి అధికారులు 'ఆపరేషన్ భేడియా'(Operation Bhediya) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ, దాడులు ఆగడం లేదు.

    తాజాగా, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తోడేళ్లు కనిపిస్తే కాల్చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు.

    ఈ మేరకు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెలువడ్డాయి. అటవీశాఖ అధికారులు మొత్తం ఆరు తోడేళ్లతో కూడిన గుంపు సంచరిస్తోందని గుర్తించారు.

    'ఆపరేషన్ భేడియా'లో భాగంగా ఇప్పటివరకు నాలుగు తోడేళ్లను పట్టుకున్నారు, కానీ మిగిలిన రెండింటిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

    వివరాలు 

    'ఆపరేషన్ భేడియా'పై యోగి ఆదిత్యనాథ్ సమీక్ష 

    ఇంతలోనే మరో దాడి జరిగింది, ఐదేళ్ల పాపపై సోమవారం రాత్రి దాడి జరిగింది. ఇప్పటివరకు తోడేళ్ల దాడుల్లో 10 మంది మరణించగా, దాదాపు 30 మందికిపైగా గాయపడ్డారు.మృతుల్లో తొమ్మిది మంది చిన్నారులే కావడం గమనార్హం.

    తాజాగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉన్నత స్థాయి అధికారులతో సమావేశమై 'ఆపరేషన్ భేడియా'పై సమీక్ష నిర్వహించారు.

    పట్టుకోవడం సాధ్యం కాకపోతే తోడేళ్లను కాల్చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే ఆ నిర్ణయాన్ని చివరి అవకాశంగా పరిగణించాలని పేర్కొన్నారు.

    బహరాయిచ్ జిల్లా కలెక్టర్ రాణి మాట్లాడుతూ, ప్రతి నాలుగు లేదా ఐదు రోజులకు ఒకసారి తోడేళ్లు కొత్త గ్రామంపై దాడి చేస్తున్నాయని, దీనివల్ల పరిస్థితిని అంచనా వేయడం సవాలుగా మారిందని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం
    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ

    ఉత్తర్‌ప్రదేశ్

    Karan Bhushan Singh: బ్రిజ్ భూషన్ కుమారుడి వాహనం ఢీ: ఇద్దరిమృతి  భారతదేశం
    Tragedy: యుపిలో దారుణం.. చెట్టు కింద నిద్రిస్తున్న 4గురిపైకి మృత్యు శకటం భారతదేశం
    Election results: ఉత్తర్‌ప్రదేశ్'లో సత్తా చాటిన ఇండియా కూటమి భారతదేశం
    Parliament: నకిలీ ఆధార్ కార్డులు చూపించి పార్లమెంట్‌లోకి ప్రవేశించిన ముగ్గురి అరెస్ట్  పార్లమెంట్ భవనం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025