NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra Pradesh: సీఎం సమక్షంలో దత్తత కార్యక్రమం ప్రారంభం.. ఆగిరిపల్లిలో అభివృద్ధికి శ్రీకారం
    తదుపరి వార్తా కథనం
    Andhra Pradesh: సీఎం సమక్షంలో దత్తత కార్యక్రమం ప్రారంభం.. ఆగిరిపల్లిలో అభివృద్ధికి శ్రీకారం
    సీఎం సమక్షంలో దత్తత కార్యక్రమం ప్రారంభం.. ఆగిరిపల్లిలో అభివృద్ధికి శ్రీకారం

    Andhra Pradesh: సీఎం సమక్షంలో దత్తత కార్యక్రమం ప్రారంభం.. ఆగిరిపల్లిలో అభివృద్ధికి శ్రీకారం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 28, 2025
    10:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన 'పీ4 కార్యక్రమం' (పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ ఫర్ పాడవలపూడి మోడల్) అమలు దశలోకి ప్రవేశిస్తోంది.

    ఈ క్రమంలో ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో ఇటీవల జరిగిన సమావేశంలో సీఎం సూచనల మేరకు, నూజివీడు సీడ్స్ సీఎండీ మండవ ప్రభాకరరావు ఆ గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు.

    ఈ పనిని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన ఆయన, గ్రామాభివృద్ధికి అవసరమైన కార్యాచరణపై అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించారు.

    ప్రాథమిక సహాయంగా, ఆగిరిపల్లికి చెందిన నన్నబోయిన వెంకట్రావుకు గేదె కొనుగోలు కోసం రూ.75,000, బోనం లక్ష్మికి ఫ్యాన్సీ షాపు ఏర్పాటు కోసం రూ.50,000 కేటాయించారు.

    Details

    గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత

    ఈ మొత్తాలను మండవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నూజివీడు మండలం తుక్కులూరులో జరిగిన కార్యక్రమంలో, నూజివీడు సీడ్స్ వ్యవస్థాపక ఛైర్మన్ మండవ వెంకట్రామయ్య, రమాదేవి దంపతుల చేతుల మీదుగా చెక్కుల రూపంలో అందించారు.

    అంతేకాదు లక్ష్మి పిల్లలను హీల్ పాఠశాలలో చేర్పించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఇతర అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రాధాన్యత క్రమంలో చేపడతామని మండవ ప్రభాకరరావు పేర్కొన్నారు.

    ఈ కార్యక్రమంలో నూజివీడు సబ్‌కలెక్టర్ స్మరణ్ రాజ్, పీ4 కోఆర్డినేటర్ విశ్రాంత డీజీఎం సుబ్బారావు, ఇతర అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.

    పీ4 కార్యక్రమం రాష్ట్ర గ్రామీణాభివృద్ధికి కొత్త దిశగా మారనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Team india: పేస్‌ కాకుండా కంట్రోల్‌ ముఖ్యం.. యువ బౌలర్లకు భరత్ అరుణ్ సలహా టీమిండియా
    SYG : సంబరాల ఏటిగట్టు నుండి రవికృష్ణ అగ్రెసివ్ లుక్ విడుదల! సాయి ధరమ్ తేజ్
    Tammudu : తమ్ముడు రిలీజ్ డేట్ పై క్లారిటీ.. అనుకున్న తేదీకే విడుదల!  నితిన్
    Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @25,100  స్టాక్ మార్కెట్

    చంద్రబాబు నాయుడు

    CM Chandrababu: అమరావతి నిర్మాణానికి నిధుల కోసం నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ పవన్ కళ్యాణ్
    AP Cabinet: వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఝలక్‌.. పేర్లు మార్పుతో కౌంటర్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం  వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    Bill Gates: భారత పార్లమెంట్‌ను సందర్శించిన బిల్ గేట్స్.. జేపీ నడ్డాతో కీలక చర్చలు బిల్ గేట్స్
    Bill Gates: బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ.. ఏపీ అభివృద్ధిపై కీలక చర్చలు బిల్ గేట్స్

    ఆంధ్రప్రదేశ్

    CRDA: నేడు సీఆర్డీఏ అథారిటీ సమావేశం.. రూ.15,757 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపే అవకాశం.. భారతదేశం
    Andhra Pradesh: ఏపీ విద్యార్థులకు సీఎం బంపర్‌ ఆఫర్‌.. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులకు రూ.25 లక్షలు భారతదేశం
    APPSC Group 1: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 అక్రమాల కేసులో 'క్యామ్‌సైన్‌ మీడియా' సంస్థ డైరెక్టర్‌ అరెస్టు  భారతదేశం
     New Flight Services: విజయవాడ నుంచి విశాఖకు నూతన విమాన సర్వీసు.. జూన్ 1 నుంచి సేవలు ప్రారంభం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025