NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Drone: సరిహద్దు వద్ద హ్యాకింగ్ ఘటన.. చైనాతో డ్రోన్‌ల డీల్‌ను రద్దు చేసిన భారత్ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Drone: సరిహద్దు వద్ద హ్యాకింగ్ ఘటన.. చైనాతో డ్రోన్‌ల డీల్‌ను రద్దు చేసిన భారత్ 
    చైనాతో డ్రోన్‌ల డీల్‌ను రద్దు చేసిన భారత్

    Drone: సరిహద్దు వద్ద హ్యాకింగ్ ఘటన.. చైనాతో డ్రోన్‌ల డీల్‌ను రద్దు చేసిన భారత్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 07, 2025
    11:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రక్షణ రంగంలో చైనా తయారీ విడిభాగాల వినియోగంపై కేంద్రం గట్టిగా స్పందిస్తోంది.

    తాజాగా, బీజింగ్‌ నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన కంపెనీలకు కేటాయించిన మూడు కాంట్రాక్టులను రద్దు చేసింది.

    సాయుధ దళాల రవాణా అవసరాల కోసం మొత్తం 400 డ్రోన్లను తయారు చేయాల్సిన ప్రాజెక్టులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

    ప్రభుత్వం ఇప్పటికే డ్రోన్లలో చైనా తయారీ విడిభాగాలు,ఎలక్ట్రానిక్స్ వాడకూడదని నిర్ధారించేందుకు ప్రత్యేకంగా పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది.

    తాజాగా రద్దయిన కాంట్రాక్టుల్లో 200 మీడియం ఆల్టిట్యూడ్ డ్రోన్లు,100 హెవీ వెయిట్ లాజిస్టిక్స్ డ్రోన్లు ఉన్నాయి.

    ఈ ప్రాజెక్ట్‌ మొత్తం విలువ రూ.230 కోట్లు. 2023లో అత్యవసర సైనిక వినియోగం కోసం చెన్నైకి చెందిన ఓ కంపెనీతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది.

    వివరాలు 

    సైబర్ భద్రత, డేటా రక్షణకు తీవ్రమైన ముప్పు

    ఈ డ్రోన్లను ప్రాథమికంగా చైనా సరిహద్దు వెంట, 3,488 కిలోమీటర్ల మేర ఉన్న వాస్తవాధీన రేఖపై మోహరించనున్నారు.

    అయితే, కొన్ని భారతీయ కంపెనీలు డ్రోన్ల తయారీ కోసం చైనా నుంచి విడిభాగాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడైంది.

    ఇది సైబర్ భద్రత, డేటా రక్షణకు తీవ్రమైన ముప్పుగా మారుతోందని రక్షణ శాఖ వర్గాలు హెచ్చరించాయి.

    అంతేకాకుండా, శత్రువులకు గోప్యతను దెబ్బతీసే అవకాశం కలిగించే వీలును కల్పిస్తోంది.

    వారు జూమింగ్ టెక్నాలజీ ద్వారా మన డ్రోన్లను నియంత్రించగలిగే అవకాశం ఉంది.

    ఇంకా, చైనా ఎలక్ట్రానిక్ పరికరాల్లో 'బ్యాక్‌డోర్' సాఫ్ట్‌వేర్ ఉండే అవకాశమూ ఉంది, దాంతో మన భద్రతా వ్యవస్థల్ని మోసగించగలరు.

    వివరాలు 

    రక్షణ శాఖ, సైన్యం డ్రోన్ల తయారీ, సర్టిఫికేషన్ ప్రక్రియపై నిఘా

    ఇటీవల చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో నిఘా మిషన్లలో డ్రోన్లు విఫలమవడం గమనార్హం.

    ఈ పరిస్థితుల నేపథ్యంలో అత్యవసర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

    గత ఏడాది ఆగస్టులో రాజౌరీ సెక్టార్‌లో మోహరించిన ఇన్‌ఫాంట్రీ దళం ప్రయోగించిన డ్రోన్లు అనుకోకుండా దారి తప్పి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కూలిన ఘటన చోటుచేసుకుంది.

    దర్యాప్తులో సాంకేతిక లోపాలు ఉన్నట్లు వెల్లడైంది.

    ఈ పరిణామాల నేపథ్యంలో రక్షణ శాఖ, సైన్యం డ్రోన్ల తయారీ, సర్టిఫికేషన్ ప్రక్రియపై మరింత నిఘా పెట్టింది.

    ఫిక్కీ (FICCI), సీఐఐ (CII) వంటి పారిశ్రామిక సంస్థలకూ దీనిపై అప్రమత్తం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    డ్రోన్

    తాజా

    Gold And Silver Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ లక్ష రూపాయలకు తులం బంగారం బంగారం
    Vijay Mallya: అరెస్టు అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే.. భారత్‌ను వీడా: విజయ్‌ మాల్యా విజయ్ మాల్యా
    Covid 19: దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. 5,364 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు.. 55 మరణాలు కరోనా కొత్త కేసులు
    USA: హార్వర్డ్‌ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశం నిలిపివేత.. ట్రంప్ కి షాక్ ఇచ్చిన ఫెడరల్‌ కోర్టు ..  అమెరికా

    డ్రోన్

    సరిహద్దులో పాకిస్థాన్ డ్రోన్‌ను కూల్చేసిన సైన్యం; ఏకే 47 మ్యాగజైన్, నగదు స్వాధీనం  జమ్ముకశ్మీర్
    సూపర్‌ సోనిక్ స్పై డ్రోన్‌ను మోహరించేందుకు చైనా కుట్ర: లీకైన యూఎస్ మిలటరీ పత్రాల్లో సంచలన నిజాలు  వాషింగ్టన్ పోస్ట్
    పొలాల్లో కూలిపోయిన డీఆర్‌డీఓ డ్రోన్; భయాందోళనకు గురైన రైతులు  కర్ణాటక
    రష్యా విమానాశ్రయంపై డ్రోన్ల దాడి.. నుజ్జునుజ్జు అయిన నాలుగు విమానాలు రష్యా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025