
Ahmedabad : అహ్మదాబాద్లో రథయాత్రలో అపశృతి.. అదుపు తప్పిన ఏనుగు.. తొక్కిసలాట
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్లోని గోల్వాడలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో ఇవాళ ఉదయం ఒక ఏనుగు హఠాత్తుగా అదుపు తప్పి కలకలం సృష్టించిన సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే, ఒడిశాలోని పూరీ రథయాత్రను ఆదర్శంగా తీసుకొని భక్తులు గుజరాత్ రాష్ట్రంలో గోల్వాడలో రథయాత్రను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యాత్రను ప్రత్యేకంగా ఆకర్షించేందుకు నిర్వాహకులు ఏనుగులను కూడా యాత్రలో భాగం చేసారు. అయితే యాత్ర ప్రారంభమైన కొన్ని నిమిషాలకే, పాల్గొన్న ఏనుగులలో ఒకటి ఆకస్మాత్తుగా ఆగ్రహంతో అదుపు తప్పింది.
వివరాలు
ఘటనలో మొత్తం 9మందికి గాయాలు
ఊహించని రీతిలో భక్తులవైపు దూసుకెళ్లడంతో,అక్కడ ఉన్న వారు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. జనం ఎటూ తేల్చుకోలేక పరుగులు తీయగా స్వల్పంగా తొక్కిసలాట కూడా ఏర్పడింది. ఈ ఘటనలో మొత్తం 9మందికి గాయాలు అయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అహ్మదాబాద్లో రథయాత్రలో అపశృతి
VIDEO | Gujarat: Three elephants go out of control during Jagannath Rath Yatra in Ahmedabad.
— Press Trust of India (@PTI_News) June 27, 2025
(Source: Third Party)
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/HYWt1hC4sX