NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: ఎయిరిండియా విమానం 8 గంటలు ఆలస్యం.. AC పని చేయక అల్లాడిన ప్రయాణికులు 
    తదుపరి వార్తా కథనం
    Delhi: ఎయిరిండియా విమానం 8 గంటలు ఆలస్యం.. AC పని చేయక అల్లాడిన ప్రయాణికులు 
    ఎయిరిండియా విమానం 8 గంటలు ఆలస్యం.. AC పని చేయక అల్లాడిన ప్రయాణికులు

    Delhi: ఎయిరిండియా విమానం 8 గంటలు ఆలస్యం.. AC పని చేయక అల్లాడిన ప్రయాణికులు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 31, 2024
    11:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలో ఎయిర్ ఇండియా విమానం 8 గంటలు ఆలస్యమవడంతో, వేడి కారణంగా ప్రయాణికుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది.

    విమానాలు ఆలస్యం కావడంతో ఎయిర్‌పోర్టులో ఎయిర్‌ కండిషన్‌ కూడా పని చేయకపోవడంతో జనం ఉక్కపోతకు గురయ్యారు. దీంతో ప్రజలు అపస్మారక స్థితిలోకి వెళ్లే పరిస్థితి నెలకొంది.

    దీంతో ఎయిరిండియా తీరుపై ప్రయాణికులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

    ఇందుకు సంబంధించిన వీడియోలను ఎక్స్ ట్విట్టర్ వేదికగా పోస్టు చేసి.. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకి ట్యాగ్ చేశారు.

    ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

    ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన విమానం 8 గంటలు ఆలస్యంగా బయలుదేరింది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

    Details 

    8 గంటల పాటు ఏసీ లేకుండా విమానంలోనే..

    ఎయిరిండియా ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాంకేతిక లోపం కారణంగా విమానం ఆలస్యమైందని చెబుతున్నారు. ప్రయాణికులను 8 గంటల పాటు ఏసీ లేకుండా విమానం లోపల ఉంచారు.

    విమానం ఆలస్యం కావడంతో 8 గంటల పాటు ఏసీ లేకుండా విమానంలోనే ఉంచడంతో ప్రయాణికుల పరిస్థితి విషమంగా మారింది.

    విమానంలో వేడి కారణంగా చాలా మంది ప్రయాణికులు అపస్మారక స్థితికి చేరుకున్నారు, దీంతో వారందరినీ విమానం నుండి బయటకి పంపించారు .

    ఢిల్లీ విమానాశ్రయంలో కూడా ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా మంది ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుని ఇంటికి తిరిగి వచ్చారు.

    Details 

    ఢిల్లీలో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత

    ఎయిర్ ఇండియా విమానాలు, విమానాశ్రయాల్లో ఏసీ పనిచేయకపోవడంతో ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది.

    ఢిల్లీలో కూడా 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుతం ఈ విమానం ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరుతుందని సమాచారం.

    అయినప్పటికీ, చాలా మంది ప్రయాణికులు, ముఖ్యంగా వృద్ధులు ఆరోగ్యం క్షీణించడంతో ఇంటికి తిరిగి వెళ్లారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎయిర్ ఇండియా

    తాజా

    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్
    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్
    Jr.NTR Birthday: లంబోర్గినీ నుంచి పోర్షే వరకు తారక్ గ్యారేజ్'లో కార్లు ఇవే..  జూనియర్ ఎన్టీఆర్

    ఎయిర్ ఇండియా

    ప్యారిస్-ఢిల్లీ: ప్రయాణికుల వికృత చేష్టలను దాచిపెట్టిన ఎయిర్ ఇండియాపై డీజీసీఏ సీరియస్ దిల్లీ
    విమానంలో మూత్ర విసర్జన: నిందితుడికి బెయిల్ నిరాకరించిన దిల్లీ కోర్టు దిల్లీ
    ఎయిర్ ఇండియా కేసులో ట్విస్ట్: 'మూత విసర్జన నేను చేయలేదు, ఆమెనే చేసుకుంది' ఎయిర్ టెల్
    విమానంలో మూత్ర విసర్జన కేసు: ఎయిర్ ఇండియాకు రూ.30లక్షల జరిమానా విధించిన డీజీసీఏ దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025