NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / డ్యూటీ అవర్స్ ముగిశాయని ఫ్లైట్ నడపనన్న పైలట్.. విమానంలోనే 350 మంది ప్రయాణికులు
    తదుపరి వార్తా కథనం
    డ్యూటీ అవర్స్ ముగిశాయని ఫ్లైట్ నడపనన్న పైలట్.. విమానంలోనే 350 మంది ప్రయాణికులు
    డ్యూటీ అవర్స్ ముగిశాయని ఫ్లైట్ నడిపేందుకు ఎయిర్ ఇండియా పైలట్ నిరాకరణ

    డ్యూటీ అవర్స్ ముగిశాయని ఫ్లైట్ నడపనన్న పైలట్.. విమానంలోనే 350 మంది ప్రయాణికులు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 26, 2023
    01:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎయిర్ ఇండియా విమానం మరో వివాదాస్పద ఘటనకు తావిచ్చింది. ప్రయాణికులతో నిండి ఉన్న విమానంలోకి ఎక్కేందుకు పైలెట్ నిరాకరించారు.

    లండన్ నుంచి దిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఆదివారం జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

    అనంతరం గమ్యస్థానం దిల్లీకి విమానం నడిపేందుకు పైలట్ ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో సుమారు 350 మంది ప్రయాణికులు 5 గంటల పాటు ఫ్లైట్ లోనే గడిపారు.

    షెడ్యూల్డ్ ప్రకారం ఆదివారం తెల్లవారు జామున 4 గంటలకే సదరు విమానం దిల్లీకి చేరాల్సి ఉంది. అయితే దిల్లీ విమానాశ్రయంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో జైపూర్‌కు దారి మళ్లించారు.

    DETAILS

    విధుల సమయం ముగిసిందంటూ ఫ్లైట్ దిగిపోయిన పైలట్

    అంతకుముందే సదరు ఫ్లైట్ లండన్ నుంచి వచ్చి దిల్లీ విమానాశ్రయం చుట్టూ 10 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. అయితే ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్ రాకపోవడంతో జైపూర్‌లో ల్యాండైంది.

    దాదాపు 2 గంటల తర్వాత ఎయిర్ ఇండియా విమానం సహా మరికొన్ని ఫ్లైట్లకూ జైపూర్ నుంచి వచ్చేందుకు దిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చింది.

    ఈ క్రమంలోనే విమానాన్ని నడిపేందుకు పైలట్ తిరస్కరించాడు. విధుల సమయం ముగిసిందంటూ కిందికి దిగిపోయాడు. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బందిపడ్డారు.

    స్పందించిన యాజమాన్యం, అత్యవసరమైన వారిని రోడ్డు మార్గానా దిల్లీకి తరలించింది. సిబ్బంది మార్పుల చేర్పుల తర్వాత అదే ఫ్లైట్ లో మిగతా ప్రయాణికులను తరలించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎయిర్ ఇండియా
    దిల్లీ

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    ఎయిర్ ఇండియా

    ప్యారిస్-ఢిల్లీ: ప్రయాణికుల వికృత చేష్టలను దాచిపెట్టిన ఎయిర్ ఇండియాపై డీజీసీఏ సీరియస్ దిల్లీ
    విమానంలో మూత్ర విసర్జన: నిందితుడికి బెయిల్ నిరాకరించిన దిల్లీ కోర్టు దిల్లీ
    ఎయిర్ ఇండియా కేసులో ట్విస్ట్: 'మూత విసర్జన నేను చేయలేదు, ఆమెనే చేసుకుంది' ఎయిర్ టెల్
    విమానంలో మూత్ర విసర్జన కేసు: ఎయిర్ ఇండియాకు రూ.30లక్షల జరిమానా విధించిన డీజీసీఏ దిల్లీ

    దిల్లీ

    పార్లమెంట్ ప్రారంభోత్సవానికి గుర్తుగా విడుదల చేసిన రూ.75 నాణెం ప్రత్యేకతలు, ఎలా కొనాలి? నరేంద్ర మోదీ
    రేపు రెజ్లర్లకు మద్దతుగా యూపీలో రైతు నాయకుల సమావేశం  రెజ్లింగ్
    ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    Delhi: సాక్షిని హత్య చేసేందుకు సాహిల్ ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు హత్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025