NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: హైదరాబాద్‌లో అన్ని వైపుల నుంచి ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
    తదుపరి వార్తా కథనం
    Telangana: హైదరాబాద్‌లో అన్ని వైపుల నుంచి ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
    హైదరాబాద్‌లో అన్ని వైపుల నుంచి ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

    Telangana: హైదరాబాద్‌లో అన్ని వైపుల నుంచి ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 07, 2024
    09:42 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ఇటీవల మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేసిన విషయం తెలిసిందే.

    ఈ ఫేజ్‌లో 116.2 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని నిర్మించేందుకు రూ. 32,237 కోట్లు ఖర్చవుతుందని పేర్కొంది. ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంగా చేపట్టేందుకు ముందుకొచ్చాయి.

    ప్రస్తుతం ఉన్న మూడు కారిడార్లతో కలిపి, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరణకు కారిడార్-4 ప్రాజెక్టును ప్రతిపాదించారు.

    నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రయాణికులు సులభంగా ఎయిర్‌పోర్టుకు చేరుకునేందుకు కారిడార్‌-1, 2, 3లను కొత్తగా ప్రతిపాదించిన కారిడార్-4తో అనుసంధానం చేయనున్నారు.

    Details

    తెలంగాణ

    నాగోల్ నుంచి ఆరాంఘర్ మీదుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు 36.6 కిలోమీటర్ల మేర కారిడార్-4 రూపొందించారు. ఈ మార్గంలో మొత్తం 24 మెట్రో స్టేషన్లు ఉండనున్నాయి.

    ఇప్పటికే ఉన్న మెట్రో మార్గాల్లో కారిడార్-1 ఎల్బీనగర్-మియాపూర్, కారిడార్-2 జేబీఎస్-ఎంజీబీఎస్, కారిడార్-3 రాయదుర్గం-నాగోల్ రూట్లను కారిడార్-4కు అనుసంధానం చేయనున్నారు.

    ఈ నాలుగు కారిడార్ల అనుసంధానంతో, నగరంలోని ఎక్కడి నుంచి అయినా మెట్రోలో ఎయిర్‌పోర్టుకు చేరుకునే అవకాశం కల్పించనున్నారు.

    తాజా ప్రతిపాదన ప్రకారం, కొత్త హైకోర్టు మీదుగా మెట్రో మార్గాన్ని మార్చారు.

    ట్రాఫిక్ అధికంగా ఉండే ఈ ప్రాంతంలో మెట్రో మార్గం రూపొందించడం ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ మార్పులు చేసినట్లు తెలిసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    తెలంగాణ

    తాజా

    Operation Sindoor: 'మా యుద్ధవిమానం నేలకూలింది'.. పాకిస్థాన్  పాకిస్థాన్
    Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం భారత సైన్యం
    INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే స్మృతి మంధాన
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌

    హైదరాబాద్

    Hydra: హైడ్రా మరింత బలోపేతం.. మూడు జోన్లుగా విభజన ఇండియా
    CV Anand: హైద‌రాబాద్ సీపీగా మళ్లీ సీవీ ఆనంద్ నియామకం  తెలంగాణ
    Murali Mohan: టీడీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్.. మురళీ మోహన్ సంస్థకు హైడ్రా నోటీసులు ఇండియా
    Future City: శంషాబాద్ విమానాశ్రయం నుండి ఫోర్త్‌ సిటీకి మెట్రో రైలు  రేవంత్ రెడ్డి

    తెలంగాణ

    Telangana: 'పరిశ్రమ 4.0' పేరుతో ఎంఎస్‌ఎంఈలకు భారీ ఊరట.. పెట్టుబడులకు అవకాశాలు  రేవంత్ రెడ్డి
    IPS: తెలుగు రాష్ట్రాలకు యువ ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయిస్తూ ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్
    Weather Report : తెలంగాణలో మళ్లీ 2 రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు ఐఎండీ
    Telangana: పరిశ్రమల హబ్.. దండుమల్కాపురం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025