NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / డోలో-650 తయారీదారుపై ఈఎస్ఐ కుంభకోణం ఆరోపణ, అలహాబాద్ హైకోర్టులో పిటిషన్
    తదుపరి వార్తా కథనం
    డోలో-650 తయారీదారుపై ఈఎస్ఐ కుంభకోణం ఆరోపణ, అలహాబాద్ హైకోర్టులో పిటిషన్
    డోలో-650 తయారీదారుపై అలహాబాద్ హైకోర్టులో పిటిషన్

    డోలో-650 తయారీదారుపై ఈఎస్ఐ కుంభకోణం ఆరోపణ, అలహాబాద్ హైకోర్టులో పిటిషన్

    వ్రాసిన వారు Stalin
    Jan 21, 2023
    12:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    డోలో-650 ట్యాబ్లెట్లను తయారు చేస్తున్న ఫార్మాస్యూటికల్ కంపెనీకి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ) కుంభకోణానికి కంపెనీ పాల్పడినట్లు ఆరోపిస్తూ, ట్రయల్ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది.

    డోలో-650 తయారీదారైన మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్‌పై ఉద్యోగులు ఆరోగ్య బీమా స్కామ్‌కు పాల్పడినట్లు న్యాయవాది ప్రదీప్ కుమార్ ద్వివేది పిటషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన జస్టిస్ రాజ్‌బీర్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం, ఫిబ్రవరి 20కు విచారణను వాయిదా వేసింది.

    డోలో-650

    30సంవత్సరాలుగా పని చేస్తున్నఉద్యోగులకు ఆరోగ్య బీమా చెల్లించలేదు: న్యాయవాది

    మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్‌ కంపెనీలో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నఉద్యోగులకు ఆరోగ్య బీమా చెల్లించలేదని న్యాయవాది ప్రదీప్ కుమార్ ద్వివేది తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మొత్తం విలువ రూ.300కోట్లు ఉంటుందని ఆయన చెప్పారు.

    డోలో-650 తయారీదారైన మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్‌పై గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. జ్వరంతో బాధపడుతున్న రోగులకు డోలో-650 టాబ్లెట్‌ను సూచించిన వైద్యులకు రూ.1,000 కోట్ల విలువైన బహుమతులను కంపెనీ అందించిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుపై ఆదాయపు పన్ను శాఖ కూడా విచారణ ఇంకా కొనసాగుతోంది.

    రూ.1,000 కోట్ల కేసు కథ ముగియక ముందే, మరోసారి డోలో-650 తయారీ కంపెనీ స్కామ్ ఆరోపణల్లో చిక్కుకుంది

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    హైకోర్టు

    తాజా

    Mini Kashmir: కశ్మీర్‌కు బదులుగా ఈ మినీ కశ్మీర్‌కెళ్లండి.. ఇదే రైట్ టైమ్! జమ్ముకశ్మీర్
    Ravindra Jadeja: జడేజాకు టెస్ట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలి : అశ్విన్ జడేజా
    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి
    TVS: 2025 టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్.. ధర తగ్గింది.. రేంజ్ పెరిగింది! టీవీఎస్ మోటార్

    ఉత్తర్‌ప్రదేశ్

    కృష్ణ జన్మభూమి వివాదం.. షాహీ ఈద్గా మసీదు వివాదాస్పదంలో సర్వేకు కోర్టు ఆదేశం భారతదేశం
    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి యోగి ఆదిత్యనాథ్
    దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు దిల్లీ
    ఎంవీ గంగా విలాస్: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించిన మోదీ నరేంద్ర మోదీ

    హైకోర్టు

    అసైన్డ్ భూముల్లో గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టులో విచారణ.. మంత్రి రజనీకి నోటీసు ఆంధ్రప్రదేశ్
    సలహాదారుల నియామకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టులో చుక్కెదురు.. క్యాడర్ కేటాయింపు రద్దు తెలంగాణ
    సద్గురుకు కర్ణాటక హైకోర్టు షాక్, ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవం నిలిపివేత కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025