NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / US Visa: అమెరికాలో భారత విద్యార్థుల్లో దాదాపు సగంమంది తెలుగువారే!
    తదుపరి వార్తా కథనం
    US Visa: అమెరికాలో భారత విద్యార్థుల్లో దాదాపు సగంమంది తెలుగువారే!
    అమెరికాలో భారత విద్యార్థుల్లో దాదాపు సగంమంది తెలుగువారే!

    US Visa: అమెరికాలో భారత విద్యార్థుల్లో దాదాపు సగంమంది తెలుగువారే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 20, 2024
    09:41 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికాలో ఎక్కువమంది భారతీయులు చదువుకోవడానికి, నివసించడానికి వీలుగా వీసాలు మంజూరు చేస్తున్నట్లు హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ రెబెకా డ్రామే తెలిపారు.

    విశాఖపట్నం లేదా విజయవాడలో వీసా అప్లికేషన్‌ సెంటర్‌ ఏర్పాటు ప్రతిపాదనను పంపినట్లు ఆమె వెల్లడించారు.

    అంతర్జాతీయ విద్యా వారోత్సవాల సందర్భంగా ఆమె, ప్రజాసంబంధాల అధికారి అలెగ్జాండర్‌ మెక్‌ లారెన్‌తో కలిసి విశాఖలో పర్యటించారు.

    అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులు ప్రథమ స్థానంలో ఉన్నారు.

    Details

    రోజుకు 1600 వీసాలు జారీ

    2023-24 నాటికి 3.3 లక్షల మంది భారత విద్యార్థులు అమెరికాలో ఉన్నారు.

    వారిలో 56 శాతం ఏపీ, తెలంగాణకు చెందినవారే. తెలంగాణ నుంచి 34 శాతం, ఏపీ నుంచి 22 శాతం విద్యార్థులు ఉన్నారని రెబెకా వెల్లడించారు.

    హైదరాబాద్‌ కాన్సుల్‌ జనరల్‌లో ఇతర నగరాలతో పోలిస్తే ఎక్కువ నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసాలు మంజూరు చేస్తున్నామన్నారు.

    ప్రస్తుతం రోజుకు 1,600 వీసాలు జారీ చేస్తున్నామనీ, 2025 ఫిబ్రవరి నాటికి ఈ సంఖ్యను 2,500కి పెంచాలనే లక్ష్యం ఉంచుకున్నామని వివరించారు.

    విద్యార్థుల వీసాల అపాయింట్‌మెంట్‌ నిరీక్షణ సమయాన్ని 3 నెలలకు తగ్గించామని, 2023లో భారతీయులకు 14 లక్షల వీసాలు జారీ చేసినట్లు తెలిపారు.

    Details

     వీసా ప్రక్రియను మరింత సులభతరం చేస్తాం

    ప్రత్యేకంగా భారతీయుల కోసం రూపొందించిన హెచ్‌1బీ డొమెస్టిక్‌ రీవాలిడేషన్‌ ప్రోగ్రామ్‌ పైలట్‌గా అమలుచేసి, 10,000 మంది హెచ్‌1బీ వీసాలను పునరుద్ధరించామని వెల్లడించారు.

    ప్రస్తుతం ఎక్కువ మంది విద్యార్థులు మాస్టర్స్‌ కోర్సుల కోసం అమెరికాకు వెళ్తున్నారని, భవిష్యత్తులో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు చదివే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశముందని చెప్పారు.

    భారత విద్యార్థుల ఆకాంక్షలను తీర్చేందుకు వీసా ప్రక్రియను మరింత సులభతరం చేస్తామని రెబెకా డ్రామే తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ

    తాజా

    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్
    Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్
    Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు  ఐపీఓ
    Revanth Reddy: డ్రగ్స్‌ నిర్మూలనలో తెలంగాణ ఆదర్శం : సీఎం రేవంత్ రెడ్డి  రేవంత్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్

    TET Results: రేపే ఏపీలో టెట్‌ ఫలితాలు.. ఇలా చెక్‌ చేసుకోవచ్చు భారతదేశం
    Seaplane: విజయవాడ - శ్రీశైలం మధ్య 'సీ ప్లేన్‌' ఏర్పాటుకు సన్నాహాలు.. 9న మరో అద్భుత ప్రయోగం  పర్యాటకం
    AP TET Results: ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల .. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి భారతదేశం
    ArcelorMittal: ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ ఆర్సెలార్‌ మిత్తల్‌.. రూ.1,61,198 కోట్లు! బిజినెస్

    తెలంగాణ

    TGSP : తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం.. 39 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్ల సస్పెన్షన్ డీజీపీ
    Group 1 exams: తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 పరీక్షలు రాష్ట్రం
    Hyderabad metro 2nd phase: నాలుగేళ్లలో మెట్రో రెండోదశ.. కేంద్రం ఆమోదానికి డీపీఆర్‌.. మెట్రో రైలు
    Andhra Pradesh New Railway Line: ఏపీలో మరో కొత్త రైల్వే లైనుకు శ్రీకారం.. కొవ్వూరు-భద్రాచలం రోడ్డు కొత్త మార్గం ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025