NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అమరరాజా నుంచి లూలూ దాకా.. ఏపీ నుంచి తెలంగాణకు మళ్లిన పెట్టుబడుల వెల్లువ
    తదుపరి వార్తా కథనం
    అమరరాజా నుంచి లూలూ దాకా.. ఏపీ నుంచి తెలంగాణకు మళ్లిన పెట్టుబడుల వెల్లువ
    ఇతర రాష్ట్రాల అభివృద్ధికి ఏపీ ఎందుకు పనిచేస్తోందని నిలదీత

    అమరరాజా నుంచి లూలూ దాకా.. ఏపీ నుంచి తెలంగాణకు మళ్లిన పెట్టుబడుల వెల్లువ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 29, 2023
    03:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ నుంచి మెగా కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

    ఈ మేరకు అమరరాజా, లూలూ లాంటి అతిపెద్ద పెట్టుబడులు కలిగిన సంస్థలు ఏపీని కాదని తెలంగాణకు క్యూ కట్టాయి.

    సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వంతో ఏర్పడిన విభేదాల కారణంగానే ఈ పెట్టుబడులు తరలిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది.

    తాజాగా అబుదాబికి చెందిన లూలూ గ్రూప్ బుధవారం హైదరాబాద్‌లో ఓ గ్రాండ్ మాల్‌కు ప్రారంభోత్సవం చేసింది.

    ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి సదరు కంపెనీ నిష్క్రమించిన 4 సంవత్సరాల తర్వాత ఇలా ఓ మెగా మాల్ ను ప్రారంభించడం గమనార్హం.

    details

    భూ కేటాయింపులను రద్దు చేసిన జగన్ సర్కార్

    ఇప్పటికే ఉన్న కాంప్లెక్స్‌ను రూ. 300 కోట్లతో లూలూ పునరుద్ధరించింది. వచ్చే ఐదేళ్లలో తెలంగాణలోని ఇతర ప్రాజెక్టుల కోసం రూ. 3,000 కోట్లకుపైగా ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది.

    చంద్రబాబు హయాంలో రూ.2,200 కోట్లతో విశాఖపట్నంలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్, ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించేందుకు గతంలో ఏపీ ప్రభుత్వంతో లూలూ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది.

    ఇందుకోసం విశాఖలో హైపర్ మార్కెట్ నిర్మాణం కోసం భూమి కూడా కేటాయించింది. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్, ఆయా భూ కేటాయింపులను రద్దు చేసింది.

    దీంతో కోయంబత్తూరులో రూ.3,000 కోట్ల పెట్టుబడి, హైదరాబాద్‌లో కూకట్‌పల్లి వద్ద రూ.3,500 కోట్లతో మెగా హైపర్ మార్కెట్ ఏర్పాటు చేసింది.

    details

    కోయంబత్తూరులో జులైలోనే ప్రారంభమైన లులూ మాల్

    తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరంలో సెప్టెంబరు 27న, లులూ తన కార్యకలాపాలను ప్రారంభించింది. మరోవైపు కోయంబత్తూరులో జులైలోనే లులూ మాల్ మొదలైంది.

    వీటి కారణంగా ప్రత్యక్షంగా దాదాపుగా 3,000 నుంచి 4,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. మరో 5 నుంచి 6 వేల మందికి పరోక్ష ఉపాధి లభించనుంది.

    అమరరాజా టు లూలూ : పెట్టుబడిదారులు ఆంధ్రా నుంచి తెలంగాణకు ఎలా మళ్లుతున్నారంటూ 'ది ప్రింట్' ఇంగ్లీష్ మీడియా కథనాన్ని నారా లోకేష్ ట్వీట్ చేశారు. అంతకుముందు నారా బ్రాహ్మిణి సైతం ట్వీట్ చేసి ప్రశ్నల వర్షం కురిపించడం గమనార్హం.

    ఇన్వెస్టర్లను, అమరరాజా, లూలూ లాంటి కంపెనీలను సీఎం జగన్ పుష్ అవుట్, పుల్ ఇన్ విధానంతో ఆంధ్రా నుంచి తెలంగాణాకు మళ్లిస్తున్నాయన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    ఆంధ్రప్రదేశ్

    నన్ను రెండు, మూడు రోజుల్లో అరెస్టు చేయొచ్చు: వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజం చంద్రబాబు నాయుడు
    'సనాతన' వ్యాఖ్యలపై స్టాలిన్ కుమారుడిని కొట్టడానికి రూ.10 లక్షలు: హిందూ సంస్థ పోస్టర్ ఉదయనిధి స్టాలిన్
    ఏపీలో ఆదర్శ వివాహం.. కుమార్తెకు దగ్గరుండి పెళ్లి జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ
    ఆంధ్రప్రదేశ్ సర్కారు గుడ్ న్యూస్.. ఈనెల 15 నుంచి ఇంటింటికీ హెల్త్ సర్వే  విడదల రజినీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025