NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chandra babu: అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించిన చంద్రబాబు 
    తదుపరి వార్తా కథనం
    Chandra babu: అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించిన చంద్రబాబు 
    అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించిన చంద్రబాబు

    Chandra babu: అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించిన చంద్రబాబు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 19, 2024
    01:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునఃప్రారంభించారు.

    ఈ సందర్భంగా సీఆర్‌డీఏ కార్యాలయ పనులను ప్రారంభించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

    గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని ఉద్దండరాయుని పాలెం వద్ద పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

    భవన నిర్మాణ ప్రాంగణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు,మంత్రి నారాయణ పూజా కార్యక్రమం నిర్వహించారు.

    టీడీపీ హయాంలో రూ. 160 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు 7 అంతస్తుల సీఆర్‌డీఏ కార్యాలయ భవనం 2017లో ప్రారంభమైంది.

    వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులు నిలిపివేశారు ప్రస్తుతం ఈ ప్రాజెక్టు 3.62 ఎకరాల్లో జరుగుతోంది.

    భవన నిర్మాణంతో పాటు,అదనంగా పార్కింగ్‌,ల్యాండ్‌ స్కేపింగ్‌ కోసం 2.51 ఎకరాలు కేటాయించారు.

    అయితే,ప్రస్తుతానికి ఆర్కిటెక్చరల్‌ ఫినిషింగ్స్‌,ఇంటీరియర్స్‌,ఎలక్ట్రిక్‌ పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.

    వివరాలు 

    రాజధాని అభివృద్ధి కోసం 54,000 ఎకరాలు

    ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ,"చరిత్రను తిరగరాయడానికి మేము ఇక్కడ సమావేశమయ్యాం.రాష్ట్ర విభజన సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైబరాబాద్‌ నగరాన్ని అభివృద్ధి చేశాం.అప్పట్లోనే ముందుచూపుతో 8వరుసల రోడ్లను నిర్మించాం.శంషాబాద్‌ విమానాశ్రయం కోసం 5,000 ఎకరాలు ఎందుకు అని ప్రశ్నించారు. అభివృద్ధికి ఎక్కడైనా ప్రతిబంధకాలే ఉంటాయి," అని తెలిపారు.

    అమరావతి రైతులను ఒప్పించి భూములు సేకరించామని, 54,000 ఎకరాలు రాజధాని అభివృద్ధి కోసం సేకరించామన్నారు. "మహిళా రైతులు వైసీపీ ప్రభుత్వంపై గట్టిగా పోరాడారు," అని చంద్రబాబు గుర్తుచేశారు.

    "అమరావతి రాష్ట్రానికి మధ్య ప్రాంతంలో ఉన్న కేంద్రం,ఒక రాష్ట్రం,ఒక రాజధాని అని అన్నిచోట్లా ప్రకటించాను.విశాఖపట్టణంని ఆర్థిక రాజధానిగా చేస్తాం.కర్నూలులో హైకోర్టు బెంచ్‌, పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం,"అని ఆయన వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    అమరావతి

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    చంద్రబాబు నాయుడు

    Chandrababu: సీఎం చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త.. చిన్న పరిశ్రమలకు హామీ లేకుండా రుణాలు భారతదేశం
    Ramcharan: నేడు సీఎం చంద్ర‌బాబును క‌ల‌వ‌నున్న ఎన్‌టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ రామ్ చరణ్
    Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన.. . వరద బాధితులకు ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్
    Free Gas Cylinder: ఎన్నికల హామీపై సీఎం కీలక ప్రకటన.. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పంపిణీ భారతదేశం

    అమరావతి

    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే మైలవరం
    అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌‌లో చల్లచల్లగా; రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు  ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025