
CM Omar Abdullah: అమెరికా స్వప్రయోజనాలకే ప్రాధాన్యం.. ట్రంప్-మునీర్ భేటీపై ఒమర్ అబ్దుల్లా!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అసిఫ్ మునీర్ల లంచ్ భేటీపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ అంశంపై తాజాగా జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. అమెరికా ఎప్పుడూ తన స్వప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తుందని, ఇతర దేశాలతో స్నేహం కూడా అదే కారణంతో చేస్తుందని ఆయన అన్నారు. యూఎస్ తనకు మేలు జరిగేంతవరకే ఇతర దేశాలతో స్నేహం చేస్తుంది. అవసరం తీరిన తరువాత మరే ఇతర దేశాన్ని కనీసం పట్టించుకోదు.
Details
స్నేహాన్ని గౌరవిస్తారా లేదా..?
డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్కి శ్వేతసౌధంలో ఆతిథ్యం ఇవ్వడాన్ని చూసి మనం ఆశ్చర్యపోకూడదని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ తన ఇష్టానికి అనుగుణంగా నడుస్తారు. ఎవరిని భేటీకి పిలవాలో, ఎవరిని పిలవకూడదో అనేది ఆయనకే సంబంధించిన విషయం. అమెరికా అధ్యక్షుడు మనకే ప్రత్యేక స్నేహితుడు అనుకోవచ్చు. కానీ ఆయన మన స్నేహాన్ని గౌరవిస్తారా లేదా అనేది మరో విషయమని ఆయన అన్నారు.