ఇండియాకు అమెరికా గుడ్ న్యూస్.. భారత్లో జీఈ విమాన ఇంజిన్ల తయారీకి యూఎస్ కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్
భారతదేశంలో జీఈ విమాన ఇంజిన్ల తయారీకి అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది.ఫలితంగా దేశీయ ఫైటర్ జెట్ల తయారీలో కీలక ముందడుగు పడింది. జనరల్ ఎలక్ట్రిక్ జీఈ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో కలిసి భారత్లోనే F-414 ఫైటర్ జెట్ ఇంజిన్లను తయారు చేయనుంది. జూన్లో ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ఈ ఒప్పందంపై సంతకాలయ్యాయి. దీంతో 80శాతం సాంకేతికతను జీఈ భారత్కు బదలాయిస్తుంది.ఫైటర్ జెట్ తేజస్ MK-2లో అమెరికన్ సాంకేతికతను వినియోగించనున్నారు. F-414 ఫైటర్ అమల్లోకి వస్తే చైనా ఫైటర్ విమానాలు వీటి ధాటికి నిలబడలేవు. సరిహద్దుల్లో భారత్తో అలజడుల నేపథ్యంలో డ్రాగన్ దేశానికి ఇది కొరకరాని కొయ్యగా మారనుంది. చైనా, రష్యాల ఇంజిన్లతో పోల్చితే వీటి జీవితకాలం, సామర్థ్యం, నాణ్యత చాలా ఎక్కువ.