NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మణిపూర్‌లో అమిత్ షా;  ఉద్రిక్తతలను తగ్గించడంపై స్పెషల్ ఫోకస్
    మణిపూర్‌లో అమిత్ షా;  ఉద్రిక్తతలను తగ్గించడంపై స్పెషల్ ఫోకస్
    1/4
    భారతదేశం 1 నిమి చదవండి

    మణిపూర్‌లో అమిత్ షా;  ఉద్రిక్తతలను తగ్గించడంపై స్పెషల్ ఫోకస్

    వ్రాసిన వారు Naveen Stalin
    May 30, 2023
    10:40 am
    మణిపూర్‌లో అమిత్ షా;  ఉద్రిక్తతలను తగ్గించడంపై స్పెషల్ ఫోకస్
    మణిపూర్‌లో అమిత్ షా; ఉద్రిక్తతలను తగ్గించడంపై స్పెషల్ ఫోకస్

    మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో పరిస్థితులపై చర్చించడానికి సోమవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపూర్ సీఎం బీరెన్ సింగ్, మంత్రులతో సమావేశమయ్యారు. జాతుల మధ్య నెలకొన్న సంఘర్షణకు పరిష్కారాన్ని కనుగొనేందుకు, ఈ ప్రాంతంలో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి ఏం చేయాలనే దానిపై మంగళవారం, బుధవారం కూడా పలు ధఫాలు మణిపూర్ ప్రభత్వ ప్రతినిధులతో అమిత్ షా సమావేశాలను నిర్వహించనున్నారు. ఎస్టీ హోదా కోసం మైతీ కమ్యూనిటీ డిమాండ్‌ను నిరసిస్తూ మే 3న కొండ జిల్లాల్లో 'గిరిజన సంఘీభావ యాత్ర' నిర్వహించిన తర్వాత మణిపూర్‌లో జాతి ఘర్షణలు మొదలయ్యాయి. 300మందికి పైగా గాయపడడంతో పాటు 110మంది ప్రాణాలు కోల్పోయారు.

    2/4

    మిలిటెంట్లపై భద్రతా దళాల ఉక్కుపాదం 

    మణిపూర్ జనాభాలో మైతీలు 53 శాతం ఉన్నారు. ఇంఫాల్ లోయలో వీరు ఎక్కువగా నివసిస్తున్నారు. గిరిజనులు నాగాలు, కుకీలు జనాభాలో మరో 40 శాతం ఉన్నారు. వీరు కొండ జిల్లాల్లో ఎక్కువగా నివసిస్తున్నారు. రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ నుంచి తమను సాగనంపేందుకే మైతీలు ఎస్టీ హోదాను కోరుతున్నారని కుకీ తెగ వ్యతిరేకించిన నేపథ్యంలో ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ క్రమంలో కొందరు మిలిటెంట్లు భద్రతా బలగాల ఆయుధాలను స్వాధీనం చేసుకొని పౌరులపై కాల్పులు జరపడంతో రాష్ట్రంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఈ క్రమంలో భద్రతా దళాలు మిలిటెంట్లపై ఉక్కుపాదం మోపే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 40మంది మిలిటెంట్లు హతమయ్యారు.

    3/4

    38 ఉద్రిక్త ప్రాంతాలను గుర్తించాం: ముఖ్యమంత్రి 

    రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న హింసాకాండను నియంత్రించేందుకు చేపట్టిన చర్యలను బుధవారం మధ్యాహ్నం అమిత్ షా విలేకరుల సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది. అతను గురువారం ఉదయం ఇంఫాల్ నుంచి బయలుదేరే అవకాశం ఉంది. రాష్ట్రంలో పరిస్థితులు సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రజలు కృషి చేయాలని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ కోరారు. ఇంఫాల్‌లో మీడియాతో మాట్లాడిన సిఎం బిరెన్, మణిపూర్‌లో 38 ఉద్రిక్త ప్రాంతాలను గుర్తించామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ ప్రాంతాల్లో సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్ఎ) సిబ్బందిని మోహరించినట్లు చెప్పారు. మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని మే 31 వరకు పొడిగించింది.

    4/4

    మణిపూర్‌లో 10వేల మంది బలగాల మోహరింపు

    తూర్పు, పశ్చిమ ఇంఫాల్‌లో మంగళవారం ఉదయం కర్ఫ్యూను సడలించారు. ఉదయం 5గంటల నుంచి 11గంటల వరకు కర్ఫ్యూ సడలించారు. ఇంఫాల్ లోయ, చుట్టుపక్కల జిల్లాల్లో ఆర్మీ, పారామిలిటరీ సిబ్బంది కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని ఒక అధికారి తెలిపారు. ఆర్మీ ఆపరేషన్ అక్రమ ఆయుధ నిల్వలను జప్తు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఇంఫాల్ లోయలో ఆదివారం కాల్పులు, ఘర్షణలు చోటుచేసుకున్న తర్వాత అనేక మంది వ్యక్తులను ఆయుధాలతో అదుపులోకి తీసుకున్నట్లు రక్షణ దళాల ప్రతినిధి తెలిపారు. మణిపూర్‌లో సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇతర పారామిలిటరీ బలగాలతో పాటు మొత్తం 10,000 మందికి పైగా సిబ్బందిని మోహరించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    అమిత్ షా
    మణిపూర్
    ముఖ్యమంత్రి
    నోంగ్‌తోంబమ్ బీరెన్ సింగ్
    తాజా వార్తలు

    అమిత్ షా

    'తమిళనాడులో పాలు సేకరించకుండా అమూల్‌ను నియంత్రిచండి': అమిత్ షాకు స్టాలిన్ లేఖ తమిళనాడు
    కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక 'రాజదండం' ఏర్పాటు; స్వాతంత్య్రానికి దానికి ఉన్నసంబంధాన్ని తెలుసుకోండి  పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    మరింత ధృడంగా కేంద్ర బలగాలు; భోజనంలో 30శాతం మిల్లెట్లను ఇవ్వాలని హోంశాఖ నిర్ణయం హోంశాఖ మంత్రి
    తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తానన్న అమిత్ షాపై ఒవైసీ ఫైర్  అసదుద్దీన్ ఒవైసీ

    మణిపూర్

    అసోంలోని సోనిత్‌పూర్‌లో 4.4 తీవ్రతతో భూకంపం అస్సాం/అసోం
    మణిపూర్‌లో 40మంది మిలిటెంట్లు హతం: సీఎం బీరెన్ సింగ్  నోంగ్‌తోంబమ్ బీరెన్ సింగ్
    మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస, ఇళ్లు దగ్ధం, కర్ఫ్యూ విధింపు ఇంఫాల్
    మణిపూర్ నుంచి సురక్షితంగా ఇళ్లకు చేరుకున్న 163మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్

    ముఖ్యమంత్రి

    NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా నందమూరి తారక రామారావు
    కర్ణాటక మంత్రివర్గ విస్తరణ: 24మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం కర్ణాటక
    నీతి ఆయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు గైర్హాజరు; ఎందుకో తెలుసా? దిల్లీ
    నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని కేజ్రీవాల్ నిర్ణయం: ప్రధానికి లేఖ  అరవింద్ కేజ్రీవాల్

    నోంగ్‌తోంబమ్ బీరెన్ సింగ్

    మణిపూర్‌లో ఉద్రిక్తత: సీఎం కార్యక్రమ వేదికకు నిప్పు; 144 సెక్షన్ విధింపు  మణిపూర్
    మణిపూర్ ఘర్షణల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం, ఉద్యోగాలు  మణిపూర్
    మణిపూర్‌లో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది: సీఎం బీరేన్ సింగ్  మణిపూర్
    మణిపూర్ హింస వెనుక విదేశీ శక్తులు; సీఎం బీరెన్ సింగ్ అనుమానాలు మణిపూర్

    తాజా వార్తలు

    జమ్మూ-శ్రీనగర్ హైవేపై లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 10మంది మృతి  జమ్మూ
    16ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపిన వ్యక్తి యూపీలో అరెస్ట్  దిల్లీ
    బీజేపీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి చేరికపై ఈటెల ఆసక్తికర కామెంట్స్  ఈటల రాజేందర్
    తెలంగాణలో 5రోజుల పాటు వర్షాలు, ఈ జిల్లాల్లో వడగళ్ల వానలు  తెలంగాణ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023