NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మణిపూర్‌లో అమిత్ షా;  ఉద్రిక్తతలను తగ్గించడంపై స్పెషల్ ఫోకస్
    తదుపరి వార్తా కథనం
    మణిపూర్‌లో అమిత్ షా;  ఉద్రిక్తతలను తగ్గించడంపై స్పెషల్ ఫోకస్
    మణిపూర్‌లో అమిత్ షా; ఉద్రిక్తతలను తగ్గించడంపై స్పెషల్ ఫోకస్

    మణిపూర్‌లో అమిత్ షా;  ఉద్రిక్తతలను తగ్గించడంపై స్పెషల్ ఫోకస్

    వ్రాసిన వారు Stalin
    May 30, 2023
    10:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

    రాష్ట్రంలో శాంతిభద్రతలు ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో పరిస్థితులపై చర్చించడానికి సోమవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపూర్ సీఎం బీరెన్ సింగ్, మంత్రులతో సమావేశమయ్యారు.

    జాతుల మధ్య నెలకొన్న సంఘర్షణకు పరిష్కారాన్ని కనుగొనేందుకు, ఈ ప్రాంతంలో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి ఏం చేయాలనే దానిపై మంగళవారం, బుధవారం కూడా పలు ధఫాలు మణిపూర్ ప్రభత్వ ప్రతినిధులతో అమిత్ షా సమావేశాలను నిర్వహించనున్నారు.

    ఎస్టీ హోదా కోసం మైతీ కమ్యూనిటీ డిమాండ్‌ను నిరసిస్తూ మే 3న కొండ జిల్లాల్లో 'గిరిజన సంఘీభావ యాత్ర' నిర్వహించిన తర్వాత మణిపూర్‌లో జాతి ఘర్షణలు మొదలయ్యాయి. 300మందికి పైగా గాయపడడంతో పాటు 110మంది ప్రాణాలు కోల్పోయారు.

    మణిపూర్

    మిలిటెంట్లపై భద్రతా దళాల ఉక్కుపాదం 

    మణిపూర్ జనాభాలో మైతీలు 53 శాతం ఉన్నారు. ఇంఫాల్ లోయలో వీరు ఎక్కువగా నివసిస్తున్నారు.

    గిరిజనులు నాగాలు, కుకీలు జనాభాలో మరో 40 శాతం ఉన్నారు. వీరు కొండ జిల్లాల్లో ఎక్కువగా నివసిస్తున్నారు.

    రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ నుంచి తమను సాగనంపేందుకే మైతీలు ఎస్టీ హోదాను కోరుతున్నారని కుకీ తెగ వ్యతిరేకించిన నేపథ్యంలో ఉద్రిక్తతలకు దారి తీసింది.

    ఈ క్రమంలో కొందరు మిలిటెంట్లు భద్రతా బలగాల ఆయుధాలను స్వాధీనం చేసుకొని పౌరులపై కాల్పులు జరపడంతో రాష్ట్రంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.

    ఈ క్రమంలో భద్రతా దళాలు మిలిటెంట్లపై ఉక్కుపాదం మోపే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 40మంది మిలిటెంట్లు హతమయ్యారు.

    మణిపూర్

    38 ఉద్రిక్త ప్రాంతాలను గుర్తించాం: ముఖ్యమంత్రి 

    రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న హింసాకాండను నియంత్రించేందుకు చేపట్టిన చర్యలను బుధవారం మధ్యాహ్నం అమిత్ షా విలేకరుల సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది.

    అతను గురువారం ఉదయం ఇంఫాల్ నుంచి బయలుదేరే అవకాశం ఉంది.

    రాష్ట్రంలో పరిస్థితులు సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రజలు కృషి చేయాలని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ కోరారు.

    ఇంఫాల్‌లో మీడియాతో మాట్లాడిన సిఎం బిరెన్, మణిపూర్‌లో 38 ఉద్రిక్త ప్రాంతాలను గుర్తించామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ ప్రాంతాల్లో సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్ఎ) సిబ్బందిని మోహరించినట్లు చెప్పారు.

    మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని మే 31 వరకు పొడిగించింది.

    మణిపూర్

    మణిపూర్‌లో 10వేల మంది బలగాల మోహరింపు

    తూర్పు, పశ్చిమ ఇంఫాల్‌లో మంగళవారం ఉదయం కర్ఫ్యూను సడలించారు. ఉదయం 5గంటల నుంచి 11గంటల వరకు కర్ఫ్యూ సడలించారు.

    ఇంఫాల్ లోయ, చుట్టుపక్కల జిల్లాల్లో ఆర్మీ, పారామిలిటరీ సిబ్బంది కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని ఒక అధికారి తెలిపారు.

    ఆర్మీ ఆపరేషన్ అక్రమ ఆయుధ నిల్వలను జప్తు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

    ఇంఫాల్ లోయలో ఆదివారం కాల్పులు, ఘర్షణలు చోటుచేసుకున్న తర్వాత అనేక మంది వ్యక్తులను ఆయుధాలతో అదుపులోకి తీసుకున్నట్లు రక్షణ దళాల ప్రతినిధి తెలిపారు.

    మణిపూర్‌లో సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇతర పారామిలిటరీ బలగాలతో పాటు మొత్తం 10,000 మందికి పైగా సిబ్బందిని మోహరించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమిత్ షా
    మణిపూర్
    ముఖ్యమంత్రి
    నోంగ్‌తోంబమ్ బీరెన్ సింగ్

    తాజా

    IPL 2025: ప్లేఆఫ్స్ రేసులో ముంబయి, ఢిల్లీకి ఇంకా ఆశలు ఉన్నాయా? ఐపీఎల్
    Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ.. ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్టాక్ మార్కెట్
    Naveen Polishetty: మణిరత్నం దర్శకత్వంలో నవీన్‌ పోలిశెట్టి.. క్రేజీ కాంబో రాబోతుందా? టాలీవుడ్
    Revanth Reddy: నేడు నాగర్‌ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌ పర్యటన రేవంత్ రెడ్డి

    అమిత్ షా

    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ త్రిపుర
    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? బీజేపీ
    అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ తెలంగాణ

    మణిపూర్

    మణిపూర్‌లో ఉద్రిక్తత: సీఎం కార్యక్రమ వేదికకు నిప్పు; 144 సెక్షన్ విధింపు  తాజా వార్తలు
    మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత; రాష్ట్రం ఎందుకు రావణకాష్టమైంది? ఈ హింస వెనకాల ఉన్న దశాబ్దాల కథేంటి? ఆర్మీ
    మణిపూర్‌లో 'నీట్ యూజీ 2023' పరీక్ష వాయిదా  తాజా వార్తలు
    మణిపూర్‌లో 23,000మందిని రక్షించిన సైన్యం; చురచంద్‌పూర్‌లో పాక్షికంగా కర్ఫ్యూ సడలింపు  తాజా వార్తలు

    ముఖ్యమంత్రి

    ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ భేటీ; టీఎస్‌పీఎస్సీని రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం! కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    Andhra pradesh: ఉత్కంఠగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; ఓటేసిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ: నష్టపోయిన పంటలను పరిశీలించిన సీఎం కేసీఆర్‌; ఎకరాకు రూ.10వేల పరిహారం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    'భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు'; రాహుల్‌ అనర్హత వేటుపై స్పందించిన సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    నోంగ్‌తోంబమ్ బీరెన్ సింగ్

    మణిపూర్‌లో 40మంది మిలిటెంట్లు హతం: సీఎం బీరెన్ సింగ్  మణిపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025