NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మున్నంగి సీఫుడ్స్ లో అమ్మోనియం గ్యాస్ లీక్..16 మంది కార్మికులకు అస్వస్థత,ఆస్పత్రికి తరలింపు
    తదుపరి వార్తా కథనం
    మున్నంగి సీఫుడ్స్ లో అమ్మోనియం గ్యాస్ లీక్..16 మంది కార్మికులకు అస్వస్థత,ఆస్పత్రికి తరలింపు
    16 మంది కార్మికులకు తీవ్రఅస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

    మున్నంగి సీఫుడ్స్ లో అమ్మోనియం గ్యాస్ లీక్..16 మంది కార్మికులకు అస్వస్థత,ఆస్పత్రికి తరలింపు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 05, 2023
    01:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ లోని సీ ఫుడ్స్ పరిశ్రమలో విష వాయువు లీకైంది. ప్రకాశం జిల్లాలోని వావిలేటిపాడులోని మున్నంగి సీ ఫుడ్స్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది.

    చేపలను ప్రాసెసింగ్ చేస్తున్న సమయంలో అమ్మోనియం గ్యాస్ లీకేజీకి గురైంది. ఈ విష వాయువును పీల్చిన సిబ్బంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.

    అమ్మోనియం గ్యాస్ కారణంగా 16 మంది కార్మికులు అపస్మారక స్థితిలోకి వెళ్లారని కంపెనీ అధికార ప్రతినిధి వెల్లడించారు.

    ఈ క్రమంలో బాధితులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించామని స్పష్టం చేశారు. అనంతరం కార్మికులకు మెరుగైన వైద్య సేవల నిమిత్తం ఒంగోలులోని రిమ్స్ లో చేర్పించామన్నారు.

    DETAILS

    ఒడిశాకు చెందిన కార్మికులకు తీవ్ర అస్వస్థత

    బాధిత కార్మికులంతా ఒడిశాకు చెందిన వారేనని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. ప్రస్తుతం కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై వివరాలేమీ తెలియరాలేదు.

    బాధిత కార్మికులందరినీ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. లీకేజీకి ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

    దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మున్నంగి సీ ఫుడ్స్ లో విష వాయువు లీకేజీలో కుట్ర కోణంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

    గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌ లోని పలు ప్రాంతాల్లో గ్యాస్ లీకేజీ ఘటనలు చోటు చేసుకోవడం కలవరపెట్టే అంశంగా మారింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    ప్రభుత్వం

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాకు అస్వస్థత; ఆస్పత్రిలో చేరిక  రోజా సెల్వమణి
    ఆంధ్రప్రదేశ్ మంత్రికి ఝలక్ ఇచ్చిన స్టాఫ్.. పేషీ సిబ్బందికి 8 నెలలుగా జీతాల్లేవ్ ప్రభుత్వం
    రాష్ట్రాలకు మూడో విడత పన్నుల పంపిణీ; రూ.1.1 లక్షల కోట్లను విడుదల చేసిన కేంద్రం  పన్ను
    వారాహి యాత్రకి ముందు జనసేనాని ధర్మ పరిరక్షణ యాగం  జనసేన

    ప్రభుత్వం

    Telangana: మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు; విద్యార్థులకు బిర్యానీ, కిచిడి  తెలంగాణ
    మణిపూర్‌లో 5జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేత; ఇప్పటి వరకు 98మంది మృతి  మణిపూర్
    సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలపై కేంద్రం దేశద్రోహం అస్త్రం : అభిషేక్ సింగ్వి కాంగ్రెస్
    ప్రమాదానికి కొద్ది క్షణాల ముందే కోరమాండల్ రాంగ్ ట్రాక్‌కి మారింది రైలు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025