NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amrit Bharat Rail : ఏపీకి అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు..ఎక్కడెక్కడ స్టాపులంటే
    తదుపరి వార్తా కథనం
    Amrit Bharat Rail : ఏపీకి అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు..ఎక్కడెక్కడ స్టాపులంటే
    Amrit Bharat Rail : ఏపీ మీదుగా అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు..ఎక్కడెక్కడ స్టాపులంటే

    Amrit Bharat Rail : ఏపీకి అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు..ఎక్కడెక్కడ స్టాపులంటే

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 29, 2023
    12:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్రం రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ అందిస్తోంది. ఇందుకు సంబంధించి మరో కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తోంది.

    ఈ మేరకు అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు శనివారం నుంచి పట్టాలెక్కనున్నాయి.

    ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. అయితే అమృత్ భారత్ రైళ్లను ప్రత్యేక సదుపాయాలతో ప్రవేశపెడుతున్నారు.

    ప్రధాని మోదీ డిసెంబర్ 30న రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు.

    1.మొదటిది యూపీలోని అయోధ్య నుంచి బిహార్‌లోని దర్బంగా

    2.రెండోది పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా - బెంగళూరుల మధ్య ఏపీ మీదుగా ప్రయాణం చేయనుంది. గంటకు 130 కి.మీ. వేగంతో దూసుకెళ్లే ఈ రైళ్లో 12 స్లీపర్‌ క్లాస్, 8 జనరల్‌, 2 గార్డు బోగీలు ఉంటాయి.

    details

    ఏపీలోని రూట్ మ్యాప్ ఇదే

    ఏపీలోని తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటల మీదుగా ఈ కొత్త అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణించనుంది.

    కానీ ఏపీలోని గూడూరు, రేణిగుంటలో మాత్రమే ఈ రైలుకు స్టాపులను నిర్ణయించారు.

    ఆకట్టుకునే ఫీచర్స్ సొంతం :

    అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ద్వితీయ శ్రేణి, స్లీపర్‌ తరగతుల్లో టికెట్‌ ఛార్జీలు ఇతర ఎక్స్‌ప్రెస్‌ల కంటే 15-17 శాతం ఎక్కువగా ఉంటాయి.

    50 కి.మీలోపు దూరానికి కనీస టికెట్‌ ధర రూ.35గా ఉంటుంది. దీనికి రిజర్వేషన్‌ రుసుం, ఇతర ఛార్జీలు అదనమని రైల్వేబోర్డు అన్ని జోన్లకు సమాచారం ఇచ్చింది. ప్రభుత్వం తిరిగి చెల్లించని(రీయంబర్స్‌ చేయని) రాయితీలను ఈ రైళ్లల్లో అనుమతించరు.

    details

    దశల వారీగా దేశమంతా అమలు 

    తొలి రైలులో సెకెండ్‌ క్లాస్‌, స్లీపర్‌ క్లాస్‌ మాత్రమే ఉంటాయి. ఏసీ ఛార్జీలు ఖరారు కాలేదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, స్వాతంత్య్ర సమరయోధుల పాసులు మాత్రం అనుమతించాలని నిర్ణయించారు.

    ఈ రైళ్లో జీరో డిశ్చార్చ్ FRP మాడ్యులర్ టాయలెట్ ప్రయాణ సమయాన్ని తగ్గించే ఫాస్టర్ యాక్సిలరేషన్ ఉంది.

    ఆధునిక డిజైన్‌,చక్కటి రంగులతో అమర్చిన సౌకర్యవంతమైన సీట్లు, బెర్త్‌లను రెఢీ చేశారు. టాయిలెట్లలో ఏరోసోల్ బేస్డ్ ఫైర్ సప్రెషన్ సిస్టమ్ దీని స్పెషాలిటీ.

    రేడియంతో తళతళలాడే ఫ్రోర్లింగ్ స్ట్రిప్‌లు ఇందులో ఉన్నాయి. ప్రయాణీకులకు మంచి అనుభూతిని పంచేలా ఫ్రీ సెమీ పెర్మనెంట్ కపులర్స్ సిద్ధం చేశారు.

    బాటిల్ హోల్టర్, మొబైల్ చార్జర్ కోసం హోల్డర్‌లు ఉంటాయి. దశల వారీగా దేశమంతా ఈ రైళ్లను విస్తరించనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025