NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP High Court: కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌ ఏర్పాటులో కీలక పరిణామం.. 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    AP High Court: కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌ ఏర్పాటులో కీలక పరిణామం.. 
    కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌ ఏర్పాటులో కీలక పరిణామం..

    AP High Court: కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌ ఏర్పాటులో కీలక పరిణామం.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 31, 2025
    08:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

    హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) శ్రీనివాస శివరాం ఈ నెల 29న కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకు లేఖ రాశారు.

    15 మంది న్యాయమూర్తులకు తగిన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా పూర్తి వివరాలను సమర్పించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

    కోర్టు కాంప్లెక్స్, కోర్టు గదులు, సిబ్బంది గదులు, న్యాయవాదుల కోసం వసతి, న్యాయమూర్తులు, కోర్టు సిబ్బందికి నివాస సౌకర్యాల వంటి వివరాలను ఒకరోజులోగా, అంటే ఈ నెల 30లోపు అందించాల్సిందిగా కలెక్టర్‌కు సూచించారు.

    వివరాలు 

    ప్రభుత్వ లేదా ప్రైవేటు భవనాల్లో హైకోర్టు బెంచ్‌

    హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ ముందుకు ఈ వివరాలను ఉంచాల్సిన బాధ్యత తనపై ఉందని రిజిస్ట్రార్ పేర్కొన్నారు.

    దీనిపై వెంటనే స్పందించిన కలెక్టర్ రంజిత్ బాషా, సంబంధిత అధికారులకు (రహదారులు, భవనాలశాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ఆర్డీవో) లేఖ రాశారు.

    ప్రభుత్వ లేదా ప్రైవేటు భవనాల్లో హైకోర్టు బెంచ్‌కు అవసరమైన సదుపాయాలు ఉన్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

    అదనంగా, ప్రభుత్వ ఖాళీ భూములను గుర్తించి ఈ నెల 30లోపు వివరాలు సమర్పించాలని కర్నూలు ఆర్డీవోకు స్పష్టంచేశారు.

    వివరాలు 

    హైకోర్టు బెంచ్ కోసం ప్రభుత్వ చర్యలు 

    ఎన్నికలకు ముందు ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కూటమి హామీ ఇచ్చింది.

    ప్రభుత్వం ఏర్పడిన అనంతరం, రాష్ట్ర మంత్రివర్గం ఈ నిర్ణయాన్ని ఆమోదించింది.

    అనంతరం శాసనసభలో కూడా తీర్మానం చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై అభిప్రాయాలు తెలియజేయడానికి, ఈ అంశాన్ని హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ (ఫుల్ కోర్ట్) ముందు ఉంచాలని రాష్ట్ర న్యాయశాఖ అప్పటి కార్యదర్శి (ఎఫ్‌ఏసీ) 2023 అక్టోబర్ 28న హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు లేఖ రాశారు.

    వివరాలు 

    సీనియర్ న్యాయమూర్తులతో కమిటీ 

    కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్, సీనియర్ న్యాయమూర్తులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.

    ఈ కమిటీలో జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ ఆర్. రఘునందన్ రావు, జస్టిస్ ఎన్. జయసూర్య, జస్టిస్ బి. కృష్ణమోహన్ సభ్యులుగా ఉన్నారు.

    వివరాలు 

    అనుకూల భవనాల కోసం పరిశీలన 

    కర్నూలులో హైకోర్టు బెంచ్, న్యాయమూర్తులు, అధికారులు, సిబ్బంది వసతులకు తగిన భవనాల కోసం పరిశీలనలు జరిగాయి.

    నగర శివారులోని దిన్నెదేవరపాడులో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (APERC) ఇటీవల నిర్మించిన రూ.25 కోట్ల విలువైన ఆధునిక భవనం పరిశీలనలో ఉంది.

    ఇందులో న్యాయస్థాన అవసరాలకు ఉపయోగపడే నాలుగు విశాలమైన హాళ్లు, ప్రత్యేక గదులు అందుబాటులో ఉన్నాయి.

    అంతేగాక, బి.తాండ్రపాడు వద్ద ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణం, సిల్వర్ జూబ్లీ కళాశాలలో ఖాళీగా ఉన్న 50 గదులు కూడా పరిశీలించబడ్డాయి.

    మునగాలపాడులోని బాలసాయిబాబా ట్రస్ట్ పరిధిలో ఓ పెద్ద పాఠశాల భవనం కూడా అందుబాటులో ఉంది. ఈ అన్ని ప్రదేశాలపై ప్రాథమిక ప్రతిపాదనలు అధికారులు సమర్పించినట్లు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్నూలు

    తాజా

    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్

    కర్నూలు

    తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు! రైల్వే శాఖ మంత్రి
    'రాయలసీమ జిల్లాలను తెలంగాణలో కలపాలి'; 'రాయల తెలంగాణ' నినాదాన్ని లేవనెత్తిన జేసీ  తెలంగాణ
    కర్నూలులో హై టెన్షన్; ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుకు సీబీఐ అధికారులు ప్రయత్నం! సీబీఐ
    కర్నులు: భర్త మృతదేహాన్ని ఇంట్లోనే దహనం చేసిన భార్య  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025