NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Karnataka covid guidelines:మాస్క్,వ్యాక్సిన్,ఐసోలేషన్: JN.1 వేరియంట్ పై కర్ణాటక కోవిడ్ మార్గదర్శకాలు
    తదుపరి వార్తా కథనం
    Karnataka covid guidelines:మాస్క్,వ్యాక్సిన్,ఐసోలేషన్: JN.1 వేరియంట్ పై కర్ణాటక కోవిడ్ మార్గదర్శకాలు
    మాస్క్,వ్యాక్సిన్,ఐసోలేషన్: JN.1 వేరియంట్ పై కర్ణాటక కోవిడ్ మార్గదర్శకాలు

    Karnataka covid guidelines:మాస్క్,వ్యాక్సిన్,ఐసోలేషన్: JN.1 వేరియంట్ పై కర్ణాటక కోవిడ్ మార్గదర్శకాలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 27, 2023
    08:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటక రాష్ట్రంలో JN.1 కరోనా వైరస్ వేరియంట్ ఇన్ఫెక్షన్ల పెరుగుదల వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో,కర్ణాటక ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం కొవిడ్ మార్గదర్శకాలను జారీ చేసింది.

    బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం, సోకిన రోగులు హోం ఐసోలేషన్ లో ఉండాలని,కోవిడ్ వైరస్ లక్షణాలతో ఉన్న పిల్లలను పాఠశాలలకు పంపకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

    మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రభుత్వ ఉపసంఘం, వృద్ధులు, ఇతర రోగాలు ఉన్నవారు కూడా 'ముందుజాగ్రత్త వ్యాక్సిన్' వేయించుకోవాలని సూచించింది.

    దీన్ని సులభతరం చేసేందుకు కేంద్రం నుంచి 30,000 డోసుల కార్బెవాక్స్ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    Details 

    నూతన సంవత్సర వేడుకలు,సమావేశాలపై ఎలాంటి ఆంక్షలు లేవు 

    అయితే నూతన సంవత్సర వేడుకలు,సమావేశాలపై ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించడం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు స్పష్టం చేశారు.

    ఇందుకు సంబంధించి ప్రభుత్వం సవివరమైన మార్గదర్శకాలను విడుదల చేయనుంది. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని సూచించారు,ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారు,ఇతర రోగాలు ఉన్నవారు తప్పనిసరి మాస్క్ ధరించాలన్నారు.

    పిల్లలు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారిని పాఠశాలకు పంపకూడదని ఆరోగ్య మంత్రిని ఉటంకిస్తూ వార్తా సంస్థ పిటిఐ పేర్కొంది.

    కోవిడ్ సోకిన వ్యక్తులు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేని పక్షంలో వారం రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని మంత్రి ఉద్ఘాటించారు.

    Details 

    JN.1 వేరియంట్‌లో 34 కేసులు

    హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాలలో పని చేస్తున్న వారందరికీ ఒక వారం తప్పనిసరి క్యాజువల్ సెలవు ఇవ్వాలి, ఆసుపత్రిలో చేరిన వారికి ఆసుపత్రిలో చేరే వ్యవధికి ప్రత్యేక సెలవు ఇవ్వాలని మార్గదర్శకాలు చేస్తామని మంత్రి చెప్పారు.

    తాజా లెక్కల ప్రకారం, రాష్ట్రంలో మూడు మరణాలతో సహా JN.1 వేరియంట్‌లో 34 కేసులు నమోదయ్యాయి.

    దేశవ్యాప్తంగా నమోదైన 69 JN.1 కేసులలో, కర్ణాటకలో అత్యధికం. కేసులు ఇంత ఎక్కువ ఉన్నా, ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని మంత్రి ఉద్ఘాటించారు.

    ఆక్సిజన్, పడకలను సిద్ధం చేశామని మంత్రి చెప్పారు. అదనంగా, రాష్ట్రంలో డెత్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు.

    Details 

    ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన సిద్ధరామయ్య

    కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం, రాష్ట్రంలోని కరోనావైరస్ JN.1 సబ్-వేరియంట్‌కు సంబంధించి పరిస్థితిని అంచనా వేయడానికి ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

    సమావేశంలో, 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు ఇంటి లోపల , ఆరుబయట మాస్క్‌లను ఉపయోగించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    కరోనా కొత్త మార్గదర్శకాలు
    కరోనా వేరియంట్
    కోవిడ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    కర్ణాటక

    కర్ణాటకలో తీవ్ర విషాదం.. కరెంట్ షాక్ తో ప్రాణాలు కోల్పోయిన 8 నెలల చిన్నారి విద్యుత్
    Fire in train: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో మంటలు  బెంగళూరు
    పొలాల్లో కూలిపోయిన డీఆర్‌డీఓ డ్రోన్; భయాందోళనకు గురైన రైతులు  రక్షణ
    చంద్రయాన్‌-3పై ప్రకాశ్ రాజ్ వివాదాస్పద ట్వీట్..  కేసు నమోదు చంద్రయాన్-3

    కరోనా కొత్త మార్గదర్శకాలు

    జనవరి 1నుంచి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి: కేంద్రం మన్‌సుఖ్ మాండవీయ
    ఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి దక్షిణ కొరియా
    ప్రయాణ ఆంక్షలను తప్పుపట్టిన చైనా.. ప్రజల ఆరోగ్యం కోసం తప్పదని చెప్పిన అమెరికా చైనా
    పశ్చిమ బెంగాల్: అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్ పశ్చిమ బెంగాల్

    కరోనా వేరియంట్

    దేశంలో కొత్తగా 1,500పైగా కరోనా కేసులు; 146రోజుల గరిష్ఠానికి వైరస్ బాధితులు కోవిడ్
    కరోనా వ్యాక్సిన్‌ మార్గదర్శకాలను సవరించిన డబ్ల్యూహెచ్‌ఓ; కొత్త సిఫార్సులు ఇలా ఉన్నాయి! ప్రపంచ ఆరోగ్య సంస్థ
    కరోనా వైరస్‌ను తయారు చేసింది చైనానే; వుహాన్ ల్యాబ్ శాస్త్రవేత్త సంచలన నిజాలు కోవిడ్
    Wuhan Lab: వుహాన్ ల్యాబ్‌పై కొరడా ఝులిపించిన అమెరికా; నిధుల నిలిపివేత  వుహాన్ ల్యాబ్

    కోవిడ్

    దేశంలో కొత్తగా 12,193 మందికి కరోనా; 42 మరణాలు  కరోనా కొత్త కేసులు
    దేశంలో కొత్తగా 10,112మందికి కరోనా; మరణాలు 29 కరోనా కొత్త కేసులు
    దిల్లీలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు; పాజిటివ్ రేటు 22.74శాతం దిల్లీ
    దేశంలో కొత్తగా 9,629 కరోనా కేసులు: 29మరణాలు కరోనా కొత్త కేసులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025