NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Prathima Murder case: కర్ణాటక ప్రభుత్వ అధికారి ప్రతిమ హత్య కేసులో.. డ్రైవర్‌ అరెస్ట్‌ 
    తదుపరి వార్తా కథనం
    Prathima Murder case: కర్ణాటక ప్రభుత్వ అధికారి ప్రతిమ హత్య కేసులో.. డ్రైవర్‌ అరెస్ట్‌ 
    Prathima Murder case: కర్ణాటక ప్రభుత్వ అధికారి ప్రతిమ హత్య కేసులో.. డ్రైవర్‌ అరెస్ట్‌

    Prathima Murder case: కర్ణాటక ప్రభుత్వ అధికారి ప్రతిమ హత్య కేసులో.. డ్రైవర్‌ అరెస్ట్‌ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 06, 2023
    12:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బెంగళూరులోని సుబ్రమణ్యపోరా ప్రాంతంలో తన ఇంట్లో శవమై కనిపించిన కర్ణాటక ప్రభుత్వ అధికారి ప్రతిమను హత్యను పోలీసులు ఛేదించారు.

    హత్య కేసుకు సంబంధించి ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

    7నుండి 10 రోజుల ముందు అతన్ని పని నుండి తొలగించినట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద్ తెలిపారు.

    గత ఐదేళ్లుగా కాంట్రాక్ట్‌పై పనిచేస్తున్న డ్రైవర్ తాను ప్రతిమను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని ఎన్‌డిటివి వర్గాలు తెలిపాయి.

    తనను ఉద్యోగం నుంచి తొలగించినందుకే ఆమెను చంపేశానని డ్రైవర్ చెప్పాడు. డ్రైవర్‌ను కిరణ్‌గా గుర్తించామని, అతను బెంగళూరుకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న చామరాజనగర్‌కు పారిపోయాడని వర్గాలు తెలిపాయి.

    Details 

    మృతదేహంపై గొంతు కోసిన గాట్లు

    ప్రతిమ రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్‌మెంట్‌లో జియాలజిస్ట్.ఆమె భర్త,కొడుకు బెంగళూరుకు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఉంటున్నారు.

    ప్రతిమ మృతదేహంపై గొంతు కోసిన గాట్లు ఉన్నాయి.పోలీసులకు ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఆమె సోదరుడు సమాచారం అందించాడు.

    శనివారం సాయంత్రం 6 గంటల వరకు ఆమె కార్యాలయంలో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆ తర్వాత కిరణ్ స్థానంలో నియమించిన డ్రైవర్ ఆమెను తన ఇంటి వద్ద దింపేశాడు.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇది జరిగింది. ఈ హత్య శనివారం రాత్రి 8 నుంచి ఆదివారం ఉదయం 8 గంటల మధ్య జరిగినట్లు భావిస్తున్నట్లు పోలీసు వర్గాలు ఎన్‌డిటివికి తెలిపాయి.

    Details 

    ప్రతిమ కుటుంబానికి న్యాయం చేస్తాం: సిద్దరామయ్య 

    ప్రతిమ,శివమొగ్గలో మాస్టర్స్ పూర్తి చేసింది. బెంగళూరులో సంవత్సరం నుండి ఉద్యోగం చేస్తోంది.

    రాష్ట్ర పర్యావరణ శాఖకు చెందిన సీనియర్ అధికారి దినేష్ మాట్లాడుతూ ప్రతిమ చాలా డైనమిక్ లేడీ అన్నారు. ఆమె ఇటీవల కొన్ని చోట్ల ఆకస్మిక దాడులు నిర్వహించిందని విలేకరులతో అయన తెలిపారు. ఆమెకు శత్రువులు ఎవరు లేరని.. తన పనిని చక్కగా చేసి గొప్ప పేరు తెచ్చుకున్నారని తెలిపారు.

    హత్యకు గురైన ప్రతిమ కుటుంబానికి న్యాయం చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూరు

    తాజా

    PM Modi: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. భద్రతా అంశాలపై చర్చించనున్న ప్రధాని కేంద్ర కేబినెట్
    Odisha: ఒడిశా ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. నర్సు తప్పుడు ఇంజెక్షన్‌.. ఐదుగురు రోగులు మృతి ఒడిశా
    Iran: ఇరాన్‌లో తప్పిపోయిన ముగ్గురు భారతీయులు క్షేమం.. రాయబార కార్యాలయం వెల్లడి  ఇరాన్
    AAP: తరగతి గదుల నిర్మాణాల్లో అవినీతి.. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లకు సమన్లు మనీష్ సిసోడియా

    బెంగళూరు

    తల్లిని చంపి, మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన మహిళ  హత్య
    బెంగళూరులో భారీ వర్షాలు; తోతట్టు ప్రాంతాలు జలమయం  వర్షాకాలం
    ఐఐటీ బాంబేకి నందన్ నీలేకని రూ.315 కోట్ల విరాళం  ముంబై
    బెంగళూరులో ఆఫీస్‌ను విక్రయించేందుకు సిద్ధమవుతున్న ఇంటెల్; దాని విలువ ఎన్ని వందల కోట్లంటే!  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025