NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tirumala: తిరుమల లడ్డూ కల్తీపై చంద్రబాబు కీలక నిర్ణయం.. సిట్ ఏర్పాటు 
    తదుపరి వార్తా కథనం
    Tirumala: తిరుమల లడ్డూ కల్తీపై చంద్రబాబు కీలక నిర్ణయం.. సిట్ ఏర్పాటు 
    తిరుమల లడ్డూ కల్తీపై చంద్రబాబు కీలక నిర్ణయం.. సిట్ ఏర్పాటు

    Tirumala: తిరుమల లడ్డూ కల్తీపై చంద్రబాబు కీలక నిర్ణయం.. సిట్ ఏర్పాటు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 23, 2024
    09:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    గత ఐదేళ్లలో వైసీపీ నేతలు తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

    ఆయన ఆదివారం ఉండవల్లిలో తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తిరుమలలో గత ఐదేళ్లుగా పవిత్రతకు విరుద్ధంగా చర్యలు జరుగుతున్నాయని, తిరుమలను రాజకీయ వేదికగా మార్చారని చంద్రబాబు మండిపడ్డారు.

    ఆయన మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి 7 కొండల్ని 2 కొండలు అంటేనే పోరాటం చేశామన్నారు.

    చిన్నప్పటి నుంచి తిరుమల శ్రీవారిపై ఎంతో విశ్వాసముందని, అలిపిరి ఘటనలో ప్రాణాలతో బయటపడటమే స్వామివారి కృప అని తెలిపారు. ఆ బ్లాస్ట్‌లో ప్రాణాలతో బయటపడటం అసాధ్యమని అన్నారు.

    వివరాలు 

    తప్పు చేసిన వారందరికీ స్వామి తగిన శిక్ష

    తిరుమల స్వామి వారి మహత్యం గురించి చంద్రబాబు మాట్లాడుతూ, భక్తుల అకౌంట్లను స్వామి ఎప్పటికప్పుడు సర్దుబాటు చేస్తారని అన్నారు.

    గత ఐదేళ్లలో భక్తుల మనోభావాలు, సమస్యలకు విలువ ఇవ్వలేదని మండిపడ్డారు. పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఉపయోగించారని,అది ప్రజల మనోభావాలను దెబ్బతీశిందని ఆరోపించారు.

    వైసీపీ ప్రభుత్వం శ్రీవారిని కూడా వదల్లేదని,లడ్డూ నాణ్యతను రివర్స్ టెండరింగ్ ద్వారా క్షీణతకు గురి చేసారని విమర్శించారు.

    ప్రధాన సంస్థలు టెండర్లలో పాల్గొనలేకపోయాయని,రివర్స్ టెండరింగ్ నిబంధనలను మార్చారని అన్నారు.

    చంద్రబాబు మాట్లాడుతూ,ఆవు నెయ్యి ధరపై ప్రశ్నలు లేవనెత్తారు. తిరుమలలో వ్యాపారాలు,వీఐపీ టికెట్లు అమ్మడం వంటి చర్యలను తప్పుబట్టారు.

    అన్యమతస్తులను టీటీడీ ఛైర్మన్‌గా నియమించడం తగదని అన్నారు.తప్పు చేసిన వారందరికీ స్వామి తగిన శిక్ష విధిస్తారని చంద్రబాబు అన్నారు.

    వివరాలు 

    తిరుమలలో శాంతిహోమం

    తిరుమల పునరుద్ధరణకు దేవుడు తనకు అవకాశం ఇచ్చారని,నూతన ఈవో శ్యామలరావుకు కూడా మార్గనిర్దేశం చేశామని తెలిపారు.

    లడ్డూనాణ్యతపై అనుమానాలు వచ్చినందున నెయ్యి శాంపిళ్లు పరీక్షల కోసం పంపించామని, పరీక్షల ఫలితాల ప్రకారం తగిన చర్యలు తీసుకున్నామని వివరించారు.

    భవిష్యత్తులో ఈవ్యవహారాలను పర్యవేక్షించడానికి నిపుణుల కమిటీ ఏర్పాటుచేస్తామని చెప్పారు.

    తిరుమలలో సోమవారం శాంతిహోమం నిర్వహించనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు.ఉదయం6 నుండి 10గంటల వరకు హోమం,పంచగవ్య ప్రోక్షణ చేయనున్నామని తెలిపారు.

    రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో హోమాలు నిర్వహించి,నాణ్యత ప్రమాణాలను పరిశీలిస్తామని వివరించారు.

    అన్నిమతాల ప్రాధాన్యతను గౌరవిస్తూ,ఆయా ప్రార్థనా మందిరాల్లో వారి మతం వారే బాధ్యతలు నిర్వర్తించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

    మతసామరస్యం కోసం అవసరమైతే ప్రత్యేక చట్టం తీసుకువస్తామని,సంప్రదాయాలను కాపాడేందుకు పండితులతో కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    తిరుమల తిరుపతి దేవస్థానం

    తాజా

    OpenAI: జానీ ఐవ్‌కు చెందిన ఏఐ కంపెనీని కొనుగోలు చేసిన ఓపెన్‌ ఏఐ  ఓపెన్ఏఐ
    PM Modi: 103 అమృత్‌ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ.. నరేంద్ర మోదీ
    Pakistan: ఆపరేషన్‌ సిందూర్‌ వేళ 50 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు కుట్ర.. తిప్పికొట్టిన బీఎస్‌ఎఫ్‌  బీఎస్‌ఎఫ్‌
    IPL 2025: నిబంధనను అతిక్రమించిన ముంబయి ఇండియన్స్‌.. పెనాల్టీగా నోబాల్‌! ముంబయి ఇండియన్స్

    చంద్రబాబు నాయుడు

    Chandrababu: సీఎం చంద్రబాబుతో, టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ భేటీ.. నూతన పారిశ్రామిక విధానంపై చర్చ  భారతదేశం
    Chandrababu: సీఐఐ డైరెక్టర్ జనరల్‌తో చంద్రబాబు భేటీ.. ఆంధ్రలో మల్టీ స్కిల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ భారతదేశం
    Chandrababu: నేడు తిరుపతి.. నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన భారతదేశం
    Chandrababu: శ్రీసిటిలో 220 పరిశ్రమ ఏర్పాటుకు ప్రణాళికలు : సీఎం చంద్రబాబు నెల్లూరు నగరం

    తిరుమల తిరుపతి దేవస్థానం

    నందిని నెయ్యిపై కర్ణాటకలో రాజకీయ దుమారం  కర్ణాటక
    Bhumana Karunakar Reddy: టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించిన భూమన కరుణాకర్‌రెడ్డి భూమన కరుణాకర్‌ రెడ్డి
    Tirumala: తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో చిన్నారి మృతి  తిరుమల తిరుపతి
    తిరుమలలో రోహిత్ శర్మ.. కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న భారత కెప్టెన్ ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025