NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP SSC Result 2025: పదో తరగతి ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌..  
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    AP SSC Result 2025: పదో తరగతి ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌..  
    పదో తరగతి ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌..

    AP SSC Result 2025: పదో తరగతి ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌..  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 15, 2025
    10:04 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే.

    ఆ తర్వాత, జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 3 నుండి ప్రారంభమై,ఏప్రిల్ 9వ తేదీతో ముగిసింది.

    మొత్తం 26 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకనం నిర్వహించబడింది. ప్రస్తుతం మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడాన్ని కొనసాగిస్తున్నారు,ఇది దాదాపు తుది దశకు చేరుకుంది.

    ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత,వారంలోపు పదో తరగతి పరీక్షల ఫలితాలు ప్రకటించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

    అందుకే,అన్ని పనులు సరిగా జరిగితే,ఏప్రిల్ 22వతేదీన పదో తరగతి ఫలితాలను విడుదల చేయాలని భావిస్తున్నారు.

    ఎప్పుడెప్పుడాని ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విద్యార్ధుల నిరీక్షలకు మరో వారంలో తెరపడనుంది.

    వివరాలు 

    పరీక్షలకు మొత్తం 6,49,884 మంది విద్యార్థులు

    కాగా, ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 17 నుండి ఏప్రిల్ 1 వరకు నిర్వహించబడ్డాయి.

    ఈ పరీక్షలకు మొత్తం 6,49,884 మంది విద్యార్థులు హాజరయ్యారు.

    అలాగే, ఏప్రిల్ 3 నుండి 7వ తేదీ వరకు,సార్వత్రిక విద్యాపీఠం పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహించబడ్డాయి, ఇవి మార్చి 17 నుండి 28 వరకు జరిగాయి.

    ఈ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం కూడా పూర్తయింది,ఈ పరీక్షల ఫలితాలు కూడా త్వరలోనే విడుదల కావచ్చును.

    ఇప్పటికే, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన ప్రభుత్వం, ఇంటర్‌ విద్యార్థులకు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లతో పాటు 'మిత్రా' వాట్సాప్‌ యాప్‌ ద్వారా నేరుగా చెక్‌ చేసుకునే అవకాశం కల్పించింది.

    వివరాలు 

    మార్కులను ఆన్‌లైన్‌లో ఎంటర్‌ చేసి..

    అదే విధంగా, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను కూడా వాట్సాప్‌ ద్వారా నేరుగా చెక్‌ చేసుకునే సౌకర్యం ఏర్పాటుచేస్తున్నారు.

    మరోవైపు, పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 15తో ముగియనుంది.

    ఏప్రిల్ 7 నుండి 19 కేంద్రాల్లో మూల్యాంకనం ప్రారంభమవగా, నేటితో మూల్యాంకనం పూర్తవ్వనుంది.

    ఆ తర్వాత మార్కులను ఆన్‌లైన్‌లో ఎంటర్‌ చేసి, త్వరగా ఫలితాలను ప్రకటించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్

    AP DSC Notificication: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన భారతదేశం
    AP News: ఏపీ మున్సిపల్‌ శాఖ గుడ్‌ న్యూస్‌.. ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ  భారతదేశం
    Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత.. హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేరిక భారతదేశం
    Adarana scheme: బీసీల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం.. రూ.1,000 కోట్ల బడ్జెట్  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025