NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆంధ్రప్రదేశ్‌: త్వరలోనే అదానీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల పనులు ప్రారంభం- 2028నాటికి పూర్తి చేయడమే లక్ష్యం
    తదుపరి వార్తా కథనం
    ఆంధ్రప్రదేశ్‌: త్వరలోనే అదానీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల పనులు ప్రారంభం- 2028నాటికి పూర్తి చేయడమే లక్ష్యం
    త్వరలో చిత్రావతి రిజర్వాయర్‌ వద్ద అదానీ హైబ్రిడ్‌ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టు పనులు ప్రారంభం

    ఆంధ్రప్రదేశ్‌: త్వరలోనే అదానీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల పనులు ప్రారంభం- 2028నాటికి పూర్తి చేయడమే లక్ష్యం

    వ్రాసిన వారు Stalin
    Feb 24, 2023
    01:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లాలోని చిత్రావతి రిజర్వాయర్‌ వద్ద అదానీ గ్రూప్‌ చేపట్టనున్న 500మెగావాట్ల పంప్‌డ్‌ స్టోరేజీ హైబ్రిడ్‌ గ్రీన్‌‌ఎనర్జీ ప్రాజెక్టు నివేదిక తుది దశకు చేరుకుందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ జిల్లా మేనేజర్ కోదండరామమూర్తి తెలిపారు.

    ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వాటిలో రెండు రాయలసీమ జిల్లాల్లో, మిగిలిన రెండు ఉత్తర ఆంధ్రలోని పార్వతీపురం జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు.

    దాదాపు రూ. 16,000 కోట్లతో 3,700 మెగావాట్ల విద్యుత్ లక్ష్యంగా నాలుగు ప్లాంట్‌లను అదానీ గ్రూప్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో 10,000 ఉపాధి లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది.

    ఆంధ్రప్రదేశ్

    పునరుత్పాదక ఇంధన విద్యుత్ ప్రాజెక్టుల కింద ప్రభుత్వానికి రూ.3వేల కోట్ల ఆదాయం

    రాయలసీమ ప్రాంతంలో మైలవరంలోని సోమశిల ప్రాజెక్టు- కర్నూలు జిల్లా అవుకు మధ్యలో మరో 3,500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అదాని గ్రూప్ ప్రాజెక్టు నివేదికను తయారు చేస్తున్నట్లు ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ జిల్లా మేనేజర్ కోదండరామమూర్తి తెలిపారు.

    వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసేందుకు రాష్ట్రంలో 6,400 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని అదనంగా ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. త్వరలో ఈ నాలుగు ప్రాజెక్టుల పనులు ప్రారంభమై, 2028 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

    పునరుత్పాదక ఇంధన విద్యుత్ ప్రాజెక్టుల కింద పవర్ స్టోరేజీ సిస్టమ్స్‌పై కూడా ప్రభుత్వానికి రూ.3,000కోట్ల ఆదాయం సమకూరనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    అదానీ గ్రూప్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఆంధ్రప్రదేశ్

    వచ్చే ఏడాది నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ తరగతులు: సీఎం జగన్ వై.ఎస్.జగన్
    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? బీజేపీ
    తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టులో చుక్కెదురు.. క్యాడర్ కేటాయింపు రద్దు తెలంగాణ
    మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని ఆదేశించిన కోర్టు అంబటి రాంబాబు

    అదానీ గ్రూప్

    FPO రద్దు చేసి, పెట్టుబడిదారుల డబ్బు తిరిగి ఇవ్వనున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ మార్కెట్
    అదానీ గ్రూప్ లో 3 సంస్థలను పరిశీలిస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి ప్రకటన
    మరిన్ని ఇబ్బందుల్లోకి అదానీ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలనంటున్న బంగ్లాదేశ్ ప్రకటన
    ప్రపంచ బిలియనీర్ల జాబితా టాప్ 20లో స్థానం కోల్పోయిన గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025