NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / గుత్తి-ధర్మవరం రైల్వే ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు పూర్తి- భారీగా పెరగనున్న రైళ్ల రాకపోకలు
    తదుపరి వార్తా కథనం
    గుత్తి-ధర్మవరం రైల్వే ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు పూర్తి- భారీగా పెరగనున్న రైళ్ల రాకపోకలు
    గుత్తి-ధర్మవరం రైల్వే ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు పూర్తి

    గుత్తి-ధర్మవరం రైల్వే ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు పూర్తి- భారీగా పెరగనున్న రైళ్ల రాకపోకలు

    వ్రాసిన వారు Stalin
    Feb 24, 2023
    12:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    Dharmavaram-Gooty: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన రైల్వే లింకు ప్రాజెక్టును దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. అనంతపురంలోని చిగిచెర్ల నుంచి ధర్మవరం మధ్య సెక్షన్ డబ్లింగ్, విద్యుద్ధీకరణను విజయవంతంగా పూర్తి చేసింది. తాజా పనుల పూర్తితో గుత్తి నుంచి ధర్మవరం వరకు మొత్తం 90 కిలోమీటర్ల మేర ఇప్పుడు డబుల్ రైల్వే లైన్ విద్యుద్దీకరించబడింది. గుత్తి-ధర్మవరం రైల్వే లింకును దక్షిణాది రాష్ట్రాలకు ప్రవేశ ద్వారంగా పరిగణిస్తారు.

    ఈ లైన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ను బెంగుళూరుతో పాటు ఇతర రాష్ట్రాలను కలిపే ముఖ్యమైన మార్గాలలో ఒకటిగా పనిచేస్తుంది.

    రూ. 1,000 కోట్ల వ్యయతో రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (ఆర్ఐటీఈఎస్) ఆధ్వర్యంలో 90 కిలోమీటర్ల మేర గుత్తి-ధర్మవరం ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుదీకరణ పనులు జరిగాయి.

    గూటి-ధర్మవరం

    దశలవారీగా గుత్తి-ధర్మవరం ప్రాజెక్టు పనులు

    గుత్తి-ధర్మవరం ప్రాజెక్టు పనులను దశలవారీగా చేపట్టారు. 2019లో కల్లూరు-గార్లదిన్నె మధ్య 13 కిలోమీటర్లు, 2020లో చిగిచెర్ల- జంగాలపల్లె మధ్య 11కిలోమీటర్లు, గార్లదిన్నె-తాటిచెర్ల మధ్య 9కిలోమీటర్లు, 2022లో తాటిచెర్ల - జంగాలపల్లె మధ్య 19కిలోమీటర్లు, ఇప్పుడు 11కిలోమీటర్ల చివరి స్ట్రెచ్‌ను పూర్తి చేశారు. ఇలా పలు దశల్లో పనులను చేయడంతో ప్రాజెక్టు పూర్తయ్యింది.

    ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన రైల్వే లైన్ ద్వారా రవాణా రద్దీని రద్దీని తగ్గిస్తుందని దక్షిణ మధ్య రైల్వే అంచనా వేస్తుంది. ఎక్కువ సంఖ్యలో ప్యాసింజర్, సరుకు రవాణా రైళ్లను నడపడానికి వీలు కల్పిస్తుంది. ఇది సెక్షన్‌లోని రైళ్ల సగటు వేగాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది. అలాగే మెరుగైన రైలు కనెక్టివిటీతో ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా? ప్రధాన మంత్రి
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ
    సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ సికింద్రాబాద్

    ఆంధ్రప్రదేశ్

    సలహాదారుల నియామకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు హైకోర్టు
    వచ్చే ఏడాది నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ తరగతులు: సీఎం జగన్ వై.ఎస్.జగన్
    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? బీజేపీ
    తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టులో చుక్కెదురు.. క్యాడర్ కేటాయింపు రద్దు తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025