NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నమస్తే ఆంధ్రప్రదేశ్‌: ఏపీలో న్యూస్ పేపర్ ఏర్పాటుపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్
    భారతదేశం

    నమస్తే ఆంధ్రప్రదేశ్‌: ఏపీలో న్యూస్ పేపర్ ఏర్పాటుపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్

    నమస్తే ఆంధ్రప్రదేశ్‌: ఏపీలో న్యూస్ పేపర్ ఏర్పాటుపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్
    వ్రాసిన వారు Naveen Stalin
    Feb 23, 2023, 02:21 pm 1 నిమి చదవండి
    నమస్తే ఆంధ్రప్రదేశ్‌: ఏపీలో న్యూస్ పేపర్ ఏర్పాటుపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్
    ఏపీలో న్యూస్ పేపర్ ఏర్పాటుపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్

    బీఆర్‌ఎస్‌ను ఆంధ్రప్రదేశ్‌‌లో విస్తరింపజేసేందుకు కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌‌లో బీఆర్ఎస్ కోసమే సొంతంగా న్యూస్‌పేపర్‌ పెట్టే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ న్యూస్‌పేపర్‌ పేరును కూడా 'నమస్తే ఆంధ్రప్రదేశ్‌'‌గా ఖారారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ పార్టీ అధ్యక్షుడిగా జనసేన మాజీ నేత తోట చంద్రశేఖర్‌ను సీఎం కేసీఆర్ నియమించారు. అలాగే, 2024లో మొత్తం 175స్థానాల్లో పోటీ చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ కోసమే సొంతంగా న్యూస్‌పేపర్‌ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    99టీవీ ఛానెల్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌‌దే

    తెలంగాణలో బీఆర్ఎస్ కోసం 'నమస్తే తెలంగాణ' అనే వార్తాపత్రిక పని చేస్తోంది. ప్రత్యేక న్యూస్ ఛానెల్ టీ-న్యూస్ కూడా ఉంది. తోట చంద్రశేఖర్‌కి ఇప్పటికే న్యూస్ ఛానెల్ 99టీవీ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో మరో ఛానెల్ అవసరం లేదు. సొంతంగా పేపర్ ఉంటే, పార్టీ ఉద్దేశాలను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లొచ్చని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి పత్రికలు పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ పెట్టబోయే 'నమస్తే ఆంధ్రప్రదేశ్' పేపర్ ఏ మేరకు ప్రజలను ఆకర్షిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    ఆంధ్రప్రదేశ్
    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    నీతి ఆయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు గైర్హాజరు; ఎందుకో తెలుసా? దిల్లీ
    21రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు; ఏ రోజున ఏం చేస్తారో తెలుసుకుందాం తెలంగాణ
    ఎంఎన్‌జే ఆస్పత్రిలో క్యాన్సర్ బాధితుల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల తెలంగాణ
    ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు తెలంగాణ

    ఆంధ్రప్రదేశ్

    NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా నందమూరి తారక రామారావు
    అరకులోయ కాఫీ పంటకు ఆర్గానిక్ సర్టిఫికేట్, వివరాలివే  భారతదేశం
    గుడ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్  వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆ రెండు పార్టీలు రెడీ  నరేంద్ర మోదీ

    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    దిల్లీలో బీఆర్ఎస్ శాశ్వత భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్  దిల్లీ
    దిల్లీకి సీఎం కేసీఆర్; రేపు బీఆర్‌ఎస్ శాశ్వత కార్యాలయం ప్రారంభోత్సవం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    నేడే తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభం; 150ఏళ్లైనా చెక్క చెదరకుండా నిర్మాణం  తెలంగాణ
    తెలంగాణ భవన్‌లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు  తెలంగాణ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023